Home » Hyderabad Metro Rail
ఓల్డ్సిటీ వాసులు మెట్రో రైలు కోసం మద్దతు పలుకుతున్నారు. తమ ప్రాంతంలో మెట్రో కలను నెరవేర్చుకోవడంలో భాగంగా ఆస్తులను ఇచ్చేందుకు సుముఖత చూపిస్తున్నారు.
ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రేపు చెక్కుల పంపిణీ చేయనున్నారు. దీంతో రెండో దశ మెట్రో పనులు ప్రారంభించడానికి లైన్ క్లియర్ క్లియర్ కానుంది.
హైదరాబాద్ నగర ఉత్తర ప్రాంత వాసులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నూతన సంవత్సర కానుక ఇచ్చారు. నార్త్సిటీకి త్వరలో మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.
మెట్రో రెండోదశలో భాగంగా చేపట్టనున్న ఎయిర్పోర్ట్ కారిడార్.. విభిన్నంగా ఉండనుందని, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కోచ్ల డిజైన్ ఉంటుందని, లగేజీ కోసం ర్యాక్లు, ఎస్కలేటర్లు,
హైదరాబాద్ మెట్రోరైలు అనతికాలంలోనే విశేష ప్రజాదరణ పొందింది. ట్రాఫిక్, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తూ విభిన్నవర్గాలకు చేరువైంది. మెరుగైన రవాణాను అందిస్తోంది. తొలిరోజుల్లో సగటున 1.60 లక్షల నుంచి 2.10 లక్షల మంది రాకపోకలు సాగించగా, ప్రస్తుతం5.6 లక్షల వరకు ప్రయాణిస్తుండడం ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు మార్గం సుగమమైంది. రెండో దశ నిర్మాణానికి రాష్ట్రం ప్రభుత్వం పరిపాలనా అనుమతులను జారీ చేసింది. ఈ రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది.
మెట్రో రెండోదశకు సంబంధించిన నిధుల సేకరణ సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోపు ప్రాజెక్టులో 70 శాతం పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వడివడిగా ముందుకు సాగుతోంది.
. మిట్టా ఎక్స్లెన్స్ ఆధ్వర్యంలో ఈరోజు (ఆదివారం) ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లో పాలీ హెల్త్ క్లినిక్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మెట్రో ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. తొలిసారిగా హెల్త్ ఏటీఎం కూడా అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. రక్త పరీక్షల డయాగ్నస్టిక్ సౌకర్యం, మెడికల్ షాప్, వైద్య నిపుణులు, ఫిజియోథెరపీ, టెలీమెడిసిన్, డెంటల్ కేర్ ఇలా అన్నీ సౌకర్యాలు మెట్రో స్టేషన్లో ఉంటాయని వెల్లడించారు.
నగర మెట్రోస్టేషన్ల వద్ద ఫ్రీ పార్కింగ్(Free parking) సదుపాయం పునరుద్ధరించాలంటూ ఈనెల 25న నాగోల్ మెట్రోస్టేషన్(Nagole Metro Station) వద్ద ప్రయాణికులు మహాధర్నాకు దిగనున్నారు. ఇటీవల నాగోల్, మియాపూర్ మెట్రోస్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయం ఎత్తివేస్తూ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెట్రో ప్రయాణికులు ప్రీపెయిడ్ పార్కింగ్ బోర్డు చూసి అవాక్కయ్యారు. దీంతో అందరూ ఒక్కసారిగా నాగోల్ మెట్రో స్టేషన్లో ఆందోళనకు దిగారు. ఎప్పటిలాగే ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అరకొర జీతాలతో జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఉండలేక నాగోల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ఉంటున్నామని, ఛార్జీలు కాకుండా అదనంగా పార్కింగ్ ఫీజు చెల్లించాలంటూ మెట్రో కొత్త రూల్స్ తీసుకురావడం దారుణం అని మండిపడ్డారు