Home » Home Minister Anitha
Home Minister Anitha: నైల్లూరు జిల్లా జైలు అధికారులకు హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనిత హెచ్చరించారు.
Home Minister Anitha: పలు మంత్రి పదవుల్లో కొనసాగిన బొత్స సత్యనారాయణకు ముద్దాయికి, సాక్షికి తేడా తెలియకపోవటం బాధాకరమని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. రామతీర్ధంలోని రాముని విగ్రహ ధ్వంసం కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తికి సహకరిస్తే బొత్స వ్యాఖ్యల్లో వారి అవగాహన రాహిత్యం బయటపడిందని విమర్శించారు.
మగపిల్లలను తల్లిదండ్రులు సరిగ్గా పెంచాలని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆడపిల్లలను రక్షిస్తే, హీరోలా చూసే రోజులు రావాలి అని హోంమంత్రి అనిత అన్నారు.
హోంమంత్రి అనితపై ప్రస్తు తం విశాఖపట్నం కోర్టులో ఉన్న చెక్బౌన్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది.
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. అనితపై 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసును హైకోర్టు కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది. తన వద్ద తీసుకున్న రూ.70 లక్షల అప్పు చెల్లించేందుకు అనిత ఇచ్చిన చెక్ చెల్లలేదని పిటిషన్ దారుడు వేగి శ్రీనివాసరావు కేసు పెట్టారు.
ప్రేమ పేరుతో వెంటపడ్డాడు.. నిరాకరించడంతో ఉన్మాదిగా మారాడు. 17 ఏళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాలిక సజీవ దహనం కాగా.. యువకుడికి కూడా మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
తప్పులు బయటపడుతున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి తన స్థాయి.. వయసును మరిచిపోయి నోటికొచ్చినట్లు చిల్లరగా మాట్లాడుతున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని.. ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని అన్నారు.
రాష్ట్ర అసెంబ్లీ గురువారం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్నవారి భరతం పట్టడంతోపాటు రేషన్ బియ్యం స్మగ్లింగ్, ఇసుక మాఫియాలను ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లు, భూ దురాక్రమణల (నిషేధిత) సవరణ బిల్లుతో పాటు మరో 5 బిల్లులను ఆమోదించింది.
దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి వచ్చిన వారూ శాసన మండలిలో నీతులు చెప్పడం దారుణమని రాష్ట్ర హోం మంత్రి అనిత వైసీపీ సభ్యులపై నిప్పులు చెరిగారు.
అసెంబ్లీలో అధికార పక్షమే ప్రతిపక్షమయింది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలు ప్రజా సమస్యలపై, అభివృద్ధి కార్యక్రమాలపై సభ్యులు వేసిన ప్రశ్నలకు మంత్రులు స్పందించారు.