Home » Home Minister Anitha
టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నారా లోకేశ్కు మంత్రులు నారాయణ, అనిత శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకవైపు పార్టీని మరోవైపు తన శాఖను ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తూ లోకేశ్ అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు.
అనకాపల్లి జిల్లా నాతవరంలో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి అనిత పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు నేతలు.
సింహాచలం అప్పన్న స్వామివారి వార్షిక చందనోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.
తప్పు చేసిన వారి విషయంలో చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏదైనా చట్ట ప్రకారం చేయడమే తప్ప ఎక్కడా ఉదాసీనతగా వ్యవహరించదని పేర్కొన్నారు
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ దాడులను హోంమంత్రి అనిత, ఎంపీలు కేశినేని శివనాథ్, కలిశెట్టి అప్పలనాయుడు ఖండించారు. డైవర్షన్ కోసమే ఏబీఎన్ సంస్థలపై వైసీపీ దాడులకు పాల్పడిందని నేతలు ఆరోపించారు.
కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్స్టేషన్లో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన బాధితులను హోంమంత్రి అనిత పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను కలిసి ధైర్యం చెప్పిన హోం మంత్రి.. వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు.
అమరావతిని అంగుళం కూడా వేరొకరు కదిపే పరిస్థితి లేకుండా కట్టుదిట్టంగా చట్టాలు, శాసనాలతో ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం సొంతమని హోం మంత్రి అనిత అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా అమరావతిని పునఃప్రతిష్టించిన కేంద్ర ప్రభుత్వానికి హోం మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పర్యటించిన హోంమంత్రి అనిత చేనేతలకు ఉచిత విద్యుత్ పథకంపై ప్రచారం చేశారు. చేనేతలకు సరికొత్త వెలుగులంటూ ఇంటింటికి వెళ్లి హోం మంత్రి కరపత్రాలను పంచారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులను ఎత్తేసిన పరిస్థితి ఏర్పడిందని హోం మంత్రి అనిత విమర్శించారు. వైసీపీ వాళ్లు వాటాలు, భాగస్వామ్యం అడిగారు కాబట్టి చాలా ప్రాజెక్టులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు.
అమరావతి కోసం రైతులు 1631 రోజుల పాటు పోరాడారని హోంమంత్రి అనిత అన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో సుదీర్ఘ కాలం జరిగిన పోరాటం ఇది అని తెలిపారు.