Home » Home Minister Anitha
విజయవాడ కనకదుర్గమ్మను హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.
విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అగ్నిప్రమాద నివారణ చర్యలకు సంబంధించిన చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించామని హోంమంత్రి అనిత అన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలపై నేరాలు 4.4 శాతం తగ్గాయని, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై శాసన మండలిలో చర్చకు అనిత సమాధానం ఇచ్చారు.
టీడీపీ కార్యకర్తలను గత 20 నెలలుగా పూర్తి అదుపులో పెట్టాం కాబట్టే రాష్ట్రంలో మంచి వాతావరణం నెలకొందని హోంమంత్రి అనిత తెలిపారు. వైసీపీ ఉచ్చులో పడకుండా టీడీపీ శ్రేణులను నియంత్రించామని అన్నారు.
అనకాపల్లి జిల్లాలోని అణుకు గ్రామస్థులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు హోంమంత్రి అనిత. కుటుంబ సమేతంగా గ్రామానికి వచ్చిన ఆమెకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
కీలక కేసుల పరిష్కారానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పీపీపీ విధానంలో భాగస్వామ్యమైన వారిని అరెస్టు చేస్తామని జగన్ మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని హెంమంత్రి అని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని... రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీకి బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు.
జగన్ హయాంలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికొదిలేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోగా డబ్బులు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు.
దిత్వా తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో అధికారులను హోంమంత్రి అనిత అలర్ట్ చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్నపుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హోంమంత్రి సూచనలు చేశారు.
దిత్వా తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావం ఎక్కువగా చూపే తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు.