Home » Hindupur
మండలంలో నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా బడిమానేసిన ఇద్దరు పిల్లలను ఎంఈఓ జానరెడ్డెప్ప శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఎనుములకొట్టపల్లికి చెందిన లక్ష్మీనారాయణ, శివమ్మ కుమారుడు గంగరాజు గొర్రెలు కాస్తున్నాడు.
పట్టణంలో ఎన్నో ఏళ్లుగా సొంతిల్లులేక వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. అలాంటి వారికోసం గత తెలుగుదేశం హయాంలో ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. పట్టణంలోని 3 వేల మందికిగాను కొటిపి సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2018 జనవరి 10న ఇళ్ల నిర్మాణానికి అప్పటి, ఇప్పటి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమిపూజచేసి పనులు ప్రారంభించారు.
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీరాములు, కొల్లకుంట నాగరాజు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఆబాద్పేటలోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నా రైతులకు విత్తన సమస్య వెంటాడుతోంది. గత సంవత్సరం వర్షాలు లేక దెబ్బతిన్న రైతన్నకు ఈ ఏడాది విత్తన వేరుశనగ లేక పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు రైతన్నలు విత్తనాన్ని సమూకుర్చే పనిలో ఉన్నారు.
ప్రజల సౌకర్యార్థం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దాతలు ఏర్పాటు చేసిన పలు ఉపకరణాలు నిరుపయోగంగా మారాయి. ఆసుపత్రిలో రోగులకు తాగునీరు అందడం లేదని తెలుసుకొని కొంత మంది దాతలు స్పందించి మాతా శిశు కేంద్రం వద్ద తాగునీరు అందించే వాటర్ ఫిల్టర్లను అందించారు.
రేషన కార్డుదారులు గంటల తరబడి వేచిచూసినా బియ్యం మాత్రం అందలేదు. దీంతో వారు డీలర్లతో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... గుడిబండ మండలం ఎస్. రాయాపురం గ్రామంలో 22, 23 రేషన షాపులున్నాయి. నాలుగు రోజుల క్రితం చౌకధాన్యపు డిపోడీలర్, ఎండీయూ ఆపరేటర్ కలిసి రేషన బియ్యాన్ని వాటర్ట్యాంక్ రూమ్వద్ద పంపిణీ చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చెవిచూసి కోలుకోలేనంతగా వైసీపీ ఇబ్బందుల్లో పడింది. ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. కొంతమంది నేరుగా అధిష్టానాన్నే తప్పు పడుతుండగా ఆయా నియోజకవర్గాల బాధ్యులను తిట్టిపోస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)ని ఓడించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) వ్యూహత్మకంగా పావులు కదిపారు. హిందూపురంలో ఓటమి ఎరుగని సైకిల్ పార్టీకి చెక్ పెట్టేందుకు భారీ స్కెచ్ వేశారు.
ప్రజల అవసరాలకు నిర్మించిన ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వాటి ఆలనా పాలన కరువవడంతో పక్కా భవనాలు దెబ్బతింటున్నాయి. మండలంలో ఇలాంటి భవనాలు పదుల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి.
మండలంలోని కొత్తబయ్యన్నపల్లి వద్ద 19వ తేదీన మల్లాపల్లిమాజీ వలంటీర్ అనిల్కుమార్యాదవ్ హత్యకేసులో కొత్తచెరువుకు చెందిన ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు పెనుకొండ డీఎస్పీ బాజీ జానసైదా విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.