Home » Heat Waves
ఉత్తర భారతంలో భానుడు కరాల నృత్యం చేస్తున్నాడు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాందా జిల్లా వరుసగా మూడో రోజు కూడా దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతంగా నిలిచింది.
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలను మించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ కారణంగా ప్రాణాలు సైతం పోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేసవి సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు.
రాబోయే మూడు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. పలు జిల్లాల్లో 45°C నుంచి 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు.
గత కొద్దిరోజులుగా మండుతున్న ఎండలతో ఉక్కపోతకు గురైన అంబర్పేట్ ప్రజలకు శుక్రవారం సాయంత్రం కురిసిన చిరుజల్లులు కొంత ఉపశమనం కలిగించాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు వర్షంతో చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.
మూడు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఎర్ర ఉల్లిపాయల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఆ నీటిలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. తినే ఆహారంలో ఎర్ర ఉల్లిపాయలను భాగం చేసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన నీటితో పాటు మినరల్స్ కూడా అందుతాయి.