Home » Heat Waves
నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. ఈ నెల 27న కేరళకు, జూన్ తొలి వారంలో తెలంగాణకు వర్షాలు వచ్చే అవకాశం.
రాష్ట్రంలో ఒకవైపు మండుతున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా భానుడు నిప్పులు కక్కుతుండగా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వరుణుడు పలకరిస్తున్నాడు.
రాష్ట్రంలో ఎండలు, వడగాలుల నుంచి ప్రజల్ని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో రోజురోజుకి ఎండలు అధికమవుతున్నాయి. 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతూ చాలా ప్రాంతాలు నిప్పులకొలిమిని తలపిస్తున్నాయి. ఎండల తీవ్రత, వేసవి తాపం తాళలేక వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మంగళవారం నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అత్యధికంగా 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 44.4, జగిత్యాల జిల్ల్లాలో 44.1, పెద్దపల్లి జిల్లాలో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
AP Heatwave Alert: ఏపీలో పెరుగుతున్న ఎండల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ మేరకు సంబంధింత అధికారులకు హోంమత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హోంమత్రి అనిత ఆదేశించారు.
ఓ వైపు మండే ఎండలు.. మరోవైపు ఈదురుగాలులు, వడగండ్ల వానలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి.
చైత్రం ప్రారంభంలోనే మాడుపగిలే ఎండలు కాస్తున్నాయి. ఇదే సమయంలో నిమిషాల వ్యవధిలో కారుమబ్బులు కమ్ముకుని ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములు పిడుగులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది.
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఎండ వేడికి తట్టుకోలేక జనం ఏసీలను, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. వాతావారణశాఖ పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Heatwave Alert: ఏపీ వ్యాప్తంగా 66 మండలాల్లో ఇవాళ(శనివారం) వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు సాధ్యమైనంతా వరకు ఎండకు దూరంగా ఉండాలని, ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.