Home » Haryana
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసి సుమారు రెండు నెలలైంది. మళ్లీ దేశంలో ఎన్నికల కోలహాలం మొదలుకాబోతుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు జరుగుతుంటాయి. దీనిలో భాగంగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా అన్నారు. తాను అలసిపోలేదని, రిటైర్ కాలేదని నవ్వుతూ చెప్పారు. పార్టీ మెజారిటీ సీట్లలో గెలిస్తే ముఖ్యమంత్రిగా ఎవరనేది పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని తెలిపారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహకాలను సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ ఆ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలోని ఈసీఐ బృందం సోమవారంనాడు చండీగఢ్ చేరుకుంది.
ఇకపై స్కూళ్లలో(schools) ఉపాధ్యాయలకు పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్పకూడదు(No Good Morning). అవును మీరు విన్నది నిజమే. కానీ దానికి బదులుగా జై హింద్ అని చెప్పాలి. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆగస్టు 15న జరగనున్నాయి.
పారిస్ ఒలింపిక్స్లో అనూహ్య రీతిలో పతకం కోల్పోయినప్పటికీ వినేష్ ఫొగట్ తమ అందరికీ చాంపియనే అని ఆమె సొంత రాష్ట్రం హరియాణా ముఖ్యమంత్రి నాయబ్సింగ్ సైనీ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా పాలసీని తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిని ప్రవేశపెడతామన్నారు. ఇందుకోసం హరియాణా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పాలసీలను అధ్యయనం చేసి, తుదిరూపు ఇస్తామని తెలిపారు.
పంజాబ్ గవర్నర్గా గులాబ్ చంద్ కటారియా బుధవారం ప్రమాణం స్వీకారం చేశారు. ఛండీగఢ్ రాజ్భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కటారియా చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పంజాబ్ కొత్త గవర్నర్గా ఆయన బాధ్యతలు చేపట్టారు.
రష్యా - ఉక్రెయిన్ల మధ్య యుద్దం కొనసాగుతుంది. అయితే ఈ యుద్దంలో పాల్గొన్న హరియాణలోని కైతల్ జిల్లా.. మాటోర్ గ్రామానికి చెందిన రవి మౌన్ మృతి చెందారు. ఈ మేరకు రష్యాలోని భారతీయ రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. రవి మృతికి సంబంధించిన సమాచారాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియ పరిచింది.
ఈ ఏడాదిలో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కే విజయావకాశాలున్నాయని పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే వెల్లడించింది. మొత్తం 90 స్థానాల్లో.. 44% ఓట్లతో కాంగ్రెస్ 43-48 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆ సర్వే తెలిపింది.
డిమాండ్ల సాధనే ధ్యేయంగా ఆరోగ్య సేవలు నిలిపేసి ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేయాలని హరియాణా వైద్యులు నిర్ణయించారు. ఇవాళ(జూలై 25న) ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవల బంద్కు హర్యానా సివిల్ మెడికల్ సర్వీసెస్ (HCMS) అసోసియేషన్ బుధవారం పిలుపునిచ్చింది.