Home » Haryana
హరియాణా అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రచారానికి తెర తీసింది. ‘ఖర్చే పే చర్చ’ పేరిట ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. బీజేపీ పాలనలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ తరహా ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల ‘చాయ్ పే చర్చ’ పేరిట రేడియోలో ప్రసంగిస్తున్న సంగతి తెలిసిందే.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని భారత ఎన్నికల కమిషన్ శనివారంనాడు సవరించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న జరగాల్సిన పోలింగ్ తేదీని అక్టోబర్ 5వ తేదీకి మార్చింది.
కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా వరకట్నం నిషేధం చట్టం-1961 కింద కేసు పెట్టడం చెల్లదని పంజాబ్-హరియాణా హైకోర్టు తీర్పు చెప్పింది.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా(Bhupendra Singh Hooda)కు సంబంధించిన భూ కుంభకోణంలో ఈడీ కీలక చర్యలు తీసుకుంది. హుడా తదితరులపై మనీలాండరింగ్ కేసులో రూ.834 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం ముఖ్యమంత్రి ఈ విధంగా ఎద్దుల బండిపై ప్రయాణించారని బీజేపీ వెల్లడించింది. అలాగే ఎన్నికల నేపథ్యంలో సీఎం సైనీ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. ఆ క్రమంలో రైతులు, దళితులు, పేదల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరిస్తున్నారని ఆ పార్టీ ప్రకటించింది.
భారతీయ జనతా పార్టీకి నూతన అధ్యక్షుడి నియామకంపై కసరత్తు దాదాపు పూర్తయింది. కానీ, హరియాణా, జమ్మూకశ్మీరు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే బీజేపీకొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న జరగాల్సిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర బీజేపీ విభాగం కోరింది. సుదీర్ఘ వారంతపు సెలవుల కారణంగా ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉన్నందున పోలింగ్ తేదీని వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది.
కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువుందనే కారణంతో ఒలింపిక్(Paris Olympics 2024) రెజ్లింగ్ పోటీల్లోంచి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్(Vinesh Phogat)ని తొలగించిన విషయం తెలిసిందే.
రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. జమ్ముకశ్మీర్లో మూడు దశల్లో (సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1).. హరియాణాలో అక్టోబరు 1న శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం వెల్లడించింది.
జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించింది. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడిస్తారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 1న నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న ఫలితాలు ప్రకటిస్తారు.