Home » Haryana
హర్యానాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎం నాయబ్ సైనీ ఢిల్లీలో బీజేపీ హైకమాండ్తో సమావేశం నిర్వహిస్తుండగా.. పంచకులలో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే హర్యానాలో ప్రమాణ స్వీకార తేదీని మార్పు చేశారు.
హర్యానా కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. గత మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన బీజేపీ సీనియర్ నేత నయబ్ సింగ్ సైనీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఆ పార్టీ ఎమ్మెల్యే, స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగటే కారణమని డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జమ్మూ కశ్మీర్లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధించగా.. హర్యానాలో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించి వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. హర్యానా ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాని ఆశించిన కాంగ్రెస్ అంచనాలు తప్పడంతో ఈవీఎంలపై ఆ పార్టీ సీనియర్ నేతలు ..
హరియాణాలో గెలుస్తుందనుకున్న కాంగ్రెస్ ఓడిపోవటం ఆ పార్టీ స్వయంకృతమని ఇండియా కూటమి పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకొని ఉంటే గెలుపు సాధ్యమయ్యేదని పేర్కొన్నాయి. శివసేన (యూబీటీ) స్పందిస్తూ..
హర్యానా ఫలితాలపై స్పందించిన జగన్.. అక్కడి ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. దీనిద్వారా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తీర్పును అవమానించేలా జగన్ మాట్లాడారనే విమర్శలు..
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ స్పందించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్ పార్టీ అంతగా పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి అతి విశ్వాసమే కారణమన్నారు.
హర్యానాలో తమ ఓటమికి ఈవీఎంలను కాంగ్రెస్ తప్పుపట్టడంపై అసదుద్దీన్ ఒవైసీ ఆక్షేపణ తెలిపారు. ఈవీఎంలను తప్పుపట్టడం చాలా సులభమని, ఈవీఎంల వల్ల మీరు నెగ్గినప్పుడు మాట్లాడరని, ఓడిపోతే మాత్రం ఈవీఎంలను తప్పు పడుతుంటారని అన్నారు.
బీజేపీకి మరింత బలం చేకూరుస్తూ స్వతంత్ర ఎమ్మెల్యేలు దేవేందర్ కడ్యాన్, రాజేష్ జూన్లు బుధవారంనాడు బీజేపీలో చేరారు. బీజేపీ తిరుగుబాటు అభ్యర్థిగా గనౌర్ నుంచి కడ్యాన్ పోటీ చేసి గెలుపొందగా, బహదూర్గఢ్ నుంచి బీజేపీ అభ్యర్థిపై పోటీ చేసి రాజేష్ జూన్ గెలిచారు.
భూపేంద్రసింగ్ హుడా, కుమారి షెల్జా మధ్య మాటల యుద్ధం నడిచింది. సీఎం అభ్యర్థి రేసులో ఉన్నానంటూ షెల్జా చేసిన ప్రకటన హుడా వర్గానికి కోపం తెప్పించింది. హుడా మాత్రం అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాలని..