Home » Hardik Pandya
2022లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు మెగా వేలంలో రూ.15 కోట్లకు హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసింది. అక్కడితో ఆగకుండా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. దీంతో గుజరాత్ జట్టును గొప్పగా నడిపించిన పాండ్య ఏకంగా తొలి సీజన్లోనే ఛాంపియన్గా నిలబెట్టాడు. ఈ సీజన్లో ఆటగాడిగానూ అతడు రాణించాడు. వరుసగా రెండో సీజన్లో కూడా పాండ్య తన కెప్టెన్సీతో గుజరాత్ను ఫైనల్కు చేర్చాడు.
Hardik pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(ఐపీఎల్ 2024) ప్రారంభం కావడానికి ఇంకా 5 నెలల సమయం ఉంది. కానీ అప్పుడే ఈ లీగ్లో సంచలనాలు నమోదవుతున్నాయి. టోర్నీ కోసం నిర్వహించే వేలానికి ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగిసిన కొన్ని రోజుల్లోనే ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్ ఎలా ఉండబోతోంది? అసలు ఏయే ఫ్రాంచైజీలు ఎవరెవరిని వదులుకున్నారు? ఎవర్ని రిటైన్ చేసుకున్నారు?
అసలే వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన బాధలో ఉన్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. గాయం కారణంగా ప్రపంచకప్ నుంచి మధ్యలోనే నిష్క్రమించిన టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పట్లో కోలుకునేలా కనిపించడంలేదు.
Hardik Pandya: స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా వన్డే ప్రపంచకప్కు దూరమయ్యాడు. దీంతో మెగా టోర్నీలో నాకౌట్ మ్యాచ్లలో టీమిండియా విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని మాజీ క్రికెట్లు అభిప్రాయపడుతున్నారు. పాండ్యాకు ప్రత్యామ్నాయంగా భారత్కు మరో నిఖార్సైన ఆల్రౌండర్ లేకపోవడం మైనస్ అని అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే మరో పాండ్య లాంటి ఆటగాడు తయారవుతున్నాడు. అతడు ఎవరో కాదు తెలుగు క్రికెటర్ రవితేజ.
బంగ్లాదేశ్తో మ్యాచ్లో గాయపడి టోర్నీ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం కావడంతో ఇప్పుడు టీమిండియా లైనప్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఐదుగురు బౌలర్లతోనే మనం మ్యాచ్లు గెలుస్తున్నా నాకౌట్ మ్యాచ్లలో ఆ ఐదుగురిలో ఎవరైనా గాయపడితే పరిస్థితేంటని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో అందరికంటే ముందుగానే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుని ఫుల్ జోష్లో ఉన్న టీమిండియాకు చావుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
వన్డే ప్రపంచకప్లో వరుస విజయాలతో భారత జట్టు అదరగొడుతోంది. ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆరు విజయాలు సాధించిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసులో ఉంది. అలాగే సెమీ ఫైనల్ బెర్త్కు కూడా చేరువైంది.
మరో మూడు మ్యాచ్ల వరకు హార్దిక్ పాండ్య అందుబాటులో ఉండే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రపంచకప్లో లీగ్ మ్యాచ్లకు పాండ్య జట్టులోకి వచ్చే అవకాశాలు లేవని స్పష్టంగా తెలుస్తోంది.
స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం విషయంలో భారత్కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఈ నెల 19న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో గాయపడిన హార్దిక్ పాండ్యా ఆ మ్యాచ్లో 3 బంతులు మాత్రమే వేసి మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత న్యూజిలాండ్తో మ్యాచ్కు దూరమయ్యాడు.