Home » Hanumantha Rao
బీఆర్ఎస్, బీజేపీ నేతలు రుణమాఫీపై అసత్య ప్రచారాలు చేసున్నారంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(V.Hanumantha Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడే ఆ పార్టీ పని ఖతమైందని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కోసం ప్రాజెక్టులు కట్టి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
ఎమర్జెన్సీ కనిపించిన వాళ్లకి గోద్రా కనిపించలేదా? అని టీపీసీసీ మాజీ చీఫ్ వి.హనుమంతరావు (Hanumantha Rao) ప్రశ్నించారు. ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిందని కొనియాడారు.
రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50ు సీలింగ్ను ఎత్తివేయాలని, ఇందుకోసం కేంద్రప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హనుమంతరావు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఢిల్లీకి వెళ్లి మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీని (PM Narendra Modi) కలిసి కులగణన చేయాలని డిమాండ్ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (Hanuman Rao) అన్నారు.కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ గెలవడంతో మరోసారి మోదీకి ప్రజలు అవకాశం ఇచ్చారని.. ఓటర్ల తీర్పును గౌరవిస్తామని వీహెచ్ పేర్కొన్నారు.