Home » Guntakal
సెంట్రల్ రైల్వేలోని డౌండ్ వద్ద జరుగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా గుంతకల్లు(Guntakal) మీదగా వెళ్లే పలు రైళ్లను దారిమళ్లించనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ముంబై-బెంగళూరు ఎక్స్ప్రెస్(Mumbai-Bangalore Express) (నెం. 11301)ను ఈనెల 29వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 11302)ను ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకూ, అలాగే కన్యాకుమారి-పూనా(Kanyakumari-Poona) ఎక్స్ప్రెస్ (నెం. 16382)ను ఈ నెల 28, 29 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 16381)ని ఈనెల 30, ఆగస్టు 1వ తేదీన పూనే, మీరజ్, కురుద్వాడి స్టేషన్ల మీదుగా మళ్లించనున్నట్లు తెలియజేశారు.
డబ్బు, నగల మీద యావతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా చంపేశాడు ఓ వ్యక్తి. గుంతకల్లు పట్టణంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యను చంపేసిన అనంతరం ఐదు నెలల పసికందుతో పారిపోతుండగా.. స్థానికులు అనుమానించి పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్య గురించి వెలుగులోకి వచ్చింది. పాత గుంతకల్లులోని కనకవీటి వీధికి చెందిన నారాయణస్వామి, రంగమ్మ దంపతులు పండ్ల వ్యాపారం చేస్తుంటారు. వీరికి ...
గుంతకల్లు, జూలై 6: ఎప్పుడూ ఒక శాతం కమీషన(లంచం) తీసుకునేవారట..! కానీ ఈసారి ఇంకొక్కశాతం ఎక్కువ కావాలని అడిగారట. ఆ దురాశే వారిని ఊచలు లెక్కబెట్టేలా చేసింది. సీబీఐ వలలో చిక్కి.. పరువు బజారున పడేలా చేసింది. గుంతకల్లు రైల్వే డివిజన కేంద్రంలో తొలిసారి సీబీఐ దాడులు జరగడానికి కారణం ఇదే అంటున్నారు. డీఆర్ఎం కార్యాలయంలో ఓ శాఖాధికారిపై కాంట్రాక్టర్లు చేసిన ఫిర్యాదు అవినీతి వృక్షాలను పెకిలించింది. రైల్వే అకౌంట్స్ విభాగంలో అవినీతి బురద డీఆర్ఎం కార్యాలయానికి మాసిపోని మరకలను అంటించింది. తిరుపతిలో ఆరు నెలల కిందట జరిగిన సీబీఐ దాడులు మరువకనే.. అంతకు మించిన అవినీతిని బయట పెట్టేదాడులు గుంతకల్లులో ..
Andhrapradesh: అవినీతి కేసులో గుంతకల్లు డీఆర్ఎం వినీత్ సింగ్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన ఓ రైల్వే కాంట్రాక్టర్ను రైల్వే అధికారులులంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రైల్వే అధికారులపై సీబీఐకి కాంట్రాక్టర్ రమేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ రమేష్ రెడ్డి ఫిర్యాదు మేరకు రెండు రోజులు పాటు అధికారులు తనిఖీలు చేపట్టారు.
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘనవిజయంతో క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈక్రమంలోనే కొందరు ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇదే వరుసలో గుంతకల్లు వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారు. ఎన్నికల ఫలితాలను ముందుగానే పసిగట్టిన నలుగురు కౌన్సిలర్లు గుమ్మనూరు జయరాంకు టిక్కెట్టు ఇచ్చిన వెంటనే టీడీపీలో చేరారు. ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో వైసీపీ కౌన్సిలర్లలో అంతర్మథనం ప్రారంభమైంది. వైసీపీ హయాంలో వార్డుల్లో ...
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని అనంతపురం ఎస్పీ గౌతమిశాలి శనివారం దర్శించుకున్నారు. ఎస్పీకి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆమె ఆలయంలో ప్రదిక్షణలు చేశారు. అర్చకులు ఆమె పేరట అర్చనలు చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన నిధులను కొందరు అధికారులు.. అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై కాజేశారు. గుంతకల్లు ఎంపీడీఓ కార్యాలయం వేదికగా సుమారు రూ.85 లక్షల వరకూ ఆరగించినట్లు సమాచారం. గతంలో పనిచేసిన కొందరు అధికారులు, వైసీపీ ప్రజాప్రతినిధులు ఏకమై స్వాహా చేశారని విశ్వసనీయంగా తెలిసింది. పనులు సక్రమంగా చేయకుండా జేబులు నింపుకున్న ఈ వ్యవహారం గురించి జడ్పీ అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదులు వెళ్లినా.. ఎలాంటి స్పందన లేదని అంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా ఒక మహిళా ఉద్యోగి సొంత ఖాతాకు రూ.20 లక్షలు మళ్లించారని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు, నాయకులు కలిసి నాలుగేళ్లలో రూ.60 ...
గుంతకల్లు-హుబ్లీ-గుంతకల్లు(Guntakallu-Hubli-Guntakallu) ప్యాసింజరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
గత వారం రోజులుగా వర్షాలకు పంటలు దెబ్బతింటే వైసీపీ సర్కార్ మొద్దు నిద్రపోతుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ విమర్శలు గుప్పించారు.
కర్ణాటకలోని దొడ్డబళ్లాపూర్ వద్ద జరుగుతున్న రైల్వే లైన్ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దుచేసి, మరికొన్నింటికి దారిమళ్లిం చినట్లు రైల్వే అ