Home » Guntakal
డి. హీరేహాళ్ మండలంలోని ఎం హనుమాపురం నుంచి కణేకల్లు మండ లం జక్కలవడికి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డంతా కంకర తేలి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ముఖ్యం గా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కంబదూరు మండల పరిధిలోని చెన్నంపల్లికి చెందిన గులగానప్ప అనే విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో 568 మార్కులు సాధించాడు. ఆ విద్యార్థి ని అభినందిస్తూ కంబ దూరు ఎస్ఐ లోకేశ కు మార్ రూ. 5 వేలు ఆర్థికసాయం అందించారు.
అనాథ లుగా మారిన చిన్నారులకు ట్రాన్సకో ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్ రవిశంకర్ రూ.20వేలు నగదు అందజే శారు. మండలంలోని పెద్దపేటకు చెందిన పల్లా శివ ప్రసాద్, భార్య హేమావతి చేతిలో హత్యకు గు రికావడం, హేమావతిని పోలీసులు అరెస్ట్ చేయడంతో వారి నలు గురు పిల్లలు అనాథలుగా మారారు.
డి. హీరేహాళ్ మండలంలోని గ్రామా ల్లో తాగునీటి సమస్య పరిష్కారా నికి డీఎంఎఫ్ నిధులతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. మొ త్తం రూ. 27 లక్షల వ్యయంతో ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో బోరు బావులు, పంపుసెట్లు, పై పులైన్లు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించనట్లు ఆర్బబ్ల్యూఎస్ ఏఈ ధనుంజయ గౌడ్ తెలిపారు.
యోగావల్ల ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం పెంపొందుతాయని, యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. అంత ర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర - 2026లో భాగంగా గురువారం జిల్లా పర్యాటకశాఖ, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం ప్రాంగ ణంలో టూరిజం డెస్టినేషన యోగా కార్యక్రమం నిర్వహించారు.
మండలకేంద్రంలో ఆధార్కేం ద్రాలు పనిచేయక పోవడంతో ఆధార్కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం విద్యార్థులు, బయోమెట్రిక్ కోసం ఉపాధి కూలీలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాడికిలో పలు సచివాలయాలు, పోస్టాఫీ సుతో పాటు ప్రైవేట్ ఆధార్ కేంద్రాలు ఉన్నాయి.
మండలంలోని తార కాపురం గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మి రథోత్సవం మంగ ళవారం సాయంత్రం భారీ జనసందోహం మధ్య అంగరంగ వైభవం గా సాగింది. ఉదయం ఆలయంలో అమ్మవారికి అభిషేకం చేసి, అ లంకరించారు.
బీటీ ప్రాజెక్టు కాలువ పనులు ఆపింది జగనరెడ్డేనని, ఆ విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకో వాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. పట్టణంలో ని ప్రజావేదిక వద్ద మంగళవారం రాష్ట్రంలో రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, దేశంలో 12 ఏళ్ల విశ్వాస్, వికాస్, జన కళ్యాణ్ విజయోత్సవా లను ఘనంగా నిర్వహించారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. మండలంలోని వంకరాజుకాలువ గ్రామానికి రూ.1.90కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్ కాల వ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని శిరిగేదొడ్డి గ్రామంలో మం గళవారం రైతులకు సబ్సిడీ విత్తన వేరుశనగ కాయల పంపిణీని ఆయన ప్రారంభించారు.