Home » Guntakal
పట్టణంలోని ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మరథోత్సవం గురువారం సాయంత్రం కన్నుల పండువగా సాగింది. స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయా న్నే మొలకాల్మూరు రోడ్డులో భక్తిశ్రద్ధలతో హోమాన్ని నిర్వహించి మడుగు తేరును లాగారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు-వాడి రైల్వే సెక్షన్లో మూడో, నాలుగో లైన్లను నిర్మించాలని కేంద్ర కేబినెట్ తీర్మానించింది.
కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలంలోని నారాయణపల్లిలో రూ.57లక్షలతో తారు రోడ్డు నిర్మాణానికి, కొండేపల్లిలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి బుధవా రం ఆమె భూమిపూజ చేశారు.
మండలంలో రీసర్వే పనులు సక్ర మంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం శెట్టూరు మండలం లోని కైరేవు గ్రామంలో రీసర్వే పనులలో భాగంగా సర్వే నంబర్ 25లో జరుగుతున్న గ్రౌండ్ ట్రూథింగ్ పనులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు.
సమస్యలు పరిష్కరించాలని డిమాం డ్ చేస్తూ సత్యసాయి మంచినీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు లులులలబుధవారం స్థానిక సత్యసాయి పంప్ హౌస్ వద్ద సీఐటీయూ ఆధ్వ ర్యంలో నిరసన చేపట్టారు.
పట్టణంలోని ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయాన్నే స్వామి వారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, కవచధారణ తదితర పూజలు నిర్వ హించారు.
పట్టణంలోని పెంగ్విన మాంటిస్సోరి స్కూల్లో బుధవారం చెస్ జిల్లా స్ధాయి అండర్-11 బాలురు, బాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. బాలురు విభాగంలో అనంతపురానికి చెందిన సాకేత నాలుగు రౌండ్లలో నాలుగు రౌండ్లు గెలి చి ప్రథమ స్థానంలో నిలిచాడు.
ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 500పైగా మార్కులు సాధించిన స్థానిక ఆదర్శపాఠశాలలోని 16మంది విద్యార్థులకు సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్ ఓబులరెడ్డి, స్కూల్ కమిటీ చైర్మన నారాయణస్వామి నగదు బహుమతులు అందజేశారు.
ఆపదలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఆయన సోమవారం మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
వాణిజ్య గ్యాస్ సిలిం డర్పై పెంచిన ధరను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్తో నిరసన తెలిపారు.