Home » Gulf News
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ గనుక అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడితే, ఆ దేశంపై మళ్లీ పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించడానికి అది మంచి కారణంగా మారుతుందని హెచ్చరించారు.
మరో అమెరికా విమానాన్ని ఇరాన్ దళాలు కూల్చేసినట్టు స్థానిక మీడియా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే, అమెరికా మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చింది.
అమెరికా ప్రయోగించిన కఠినమైన సైనిక చర్యలు, బలమైన ఆర్థిక ఒత్తిళ్ల వల్లే.. ఇరాన్ చివరకు తమ అణు కార్యక్రమంపై చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చిందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. ఇది.. అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన విజయమన్నారు.
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్యానికి భద్రత కల్పించడం అత్యవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ గురువారం పేర్కొన్నారు. మాస్కోలో జరుగుతున్న ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరమ్లో డోభాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు.
ఇరాన్- అమెరికా యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించడం ద్వారా ఏదో ఒక రకమైన లబ్ది పొందాలని భావించిన పాక్.. ఇప్పుడు అడ్డకత్తెరలోపడింది. ట్రంప్ పెట్టిన కొత్త మెలికతో ఏం చేయాలో పాలుపోక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాల్సిన పరిస్థితి పాకిస్తాన్కు దాపురించింది..
ఒకవైపు యుద్ధ విరమణ ఒప్పందం కోసం కీలక చర్చలు జరుగుతుండగానే, మరోవైపు దక్షిణ ఇరాన్ ప్రాంతంలో మైన్లను అమర్చడానికి ప్రయత్నిస్తున్న ఇరాన్ బోట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం తాజాగా 'ఆత్మరక్షణ దాడులు' నిర్వహించింది.
60 రోజుల కాల్పుల విరమణ, హార్ముజ్ జలసంధి పునరుద్ధరణ, చమురు ఆంక్షల సడలింపులపై అమెరికా-ఇరాన్ ప్రాథమిక ఒప్పందానికి వస్తున్నప్పటికీ, తమ అణు నిల్వలను అప్పగించే అంశం ఇందులో భాగం కాదని ఇరాన్ అంటోంది. హెజ్బొల్లాతో కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అమెరికా మళ్లీ దాడులు మొదలుపెడుతుందన్న వార్తల నడుమ ఇరాన్ అప్రమత్తమైంది. దేశ పశ్చిమప్రాంతంలో గగనతలాన్ని సోమవారం వరకూ మూసివేస్తూ నోటామ్ను జారీ చేసింది.
హోర్ముజ్ మీదుగా ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు కోసం ప్రయత్నిస్తున్న ఇరాన్ తాజాగా అక్కడి సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్పై ఫీజుల వసూలుకు సిద్ధమైనట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
యూఏఈలోని అణువిద్యుత్ కేంద్రంపై దాడి జరగడాన్ని భారత్ తాజాగా ఖండించింది. పరిస్థితి ప్రమాదకరమైన మలుపు తిరుగుతోందని హెచ్చరించింది.