Home » Gulf News
హోర్ముజ్ జలసంధి చుట్టూ మళ్లీ మడత పేచీ మొదలైంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు నిన్న ఇరాన్ ప్రకటించగా, ఆ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ ఇవాళ పూర్తిగా తోసిపుచ్చింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన కొద్ది సేపటికే అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది.
ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితుల నడుమ భారత నౌకాదళం దేశ ఆర్థిక స్థిరత్వానికి బలమైన రక్షణ కవచంగా నిలిచిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. 18 నౌకల్లో రూ.9వేల కోట్ల సరకును సురక్షితంగా భారత్కు చేర్చిందని తెలిపారు.
ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం, కాల్పుల విరమణ కూడా ముగిసిపోయిందని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇవాళ ఆయన స్వస్థలమైన మష్హద్లో ముగిశాయి. ఇరాన్, ఇరాక్ దేశాల్లో గత ఆరు రోజులుగా సాగుతున్న సుదీర్ఘ అంతిమయాత్ర ఈ సాయంత్రం జరిగిన ఖననంతో ముగిసింది.
పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. ఒమన్ కారిడార్ గుండా ప్రయాణిస్తున్న ఓ భారత చమురు ట్యాంకర్ను ఇరాన్ భద్రతా దళాలు వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది. దీంతో భారత ప్రభుత్వం రంగంలోకి దిగినట్టు సమాచారం.
ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన దూకుడు వైఖరిని ప్రదర్శించారు. ఇరాన్తో తాము శాంతి ఒప్పందమైనా చేసుకుంటామని, లేదంటే ఆ చాప్టర్ను పూర్తిగా ముగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
ఇరాన్ అగ్రనేతలు.. యుద్ధ విరమణ కోసం జరిపే శాంతి చర్చల ప్రతినిధులైన విదేశాంగ మంత్రి అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్లపై ఇజ్రాయెల్ ప్లాన్ చేసిన 'హత్య కుట్ర'ను అమెరికా ముందే పసిగట్టి, ఇరాన్ను అప్రమత్తం చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడినట్లు ఒక సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది.
ఇరాన్ అణు కార్యక్రమాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అణు దేశంగా మారడాన్ని తాము ఎంతమాత్రం సహించబోమని, అవసరమైతే ఆ దేశంపై మరోసారి సైనిక దాడి చేయడానికి కూడా వెనుకాడబోమన్నారు.
హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరుపక్షాల మధ్య ఇటీవల జరిగిన సైనిక ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ప్రకటన చేశారు. అమెరికాతో సమావేశం కావాలని ఇరాన్ అభ్యర్థించిందని, రేపు దోహాలో టెహ్రాన్తో చర్చలు జరుగుతాయని చెప్పారు.