Home » Gujarat
ఏడాది కాలంలో దేశంలో కొత్తగా 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వీటిలో అదనంగా 3,272 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
గుజరాత్లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. అమెరికాలోని షికాగోలో నివసిస్తూ.. ఇక్కడ ప్రతి నెల జీతం అందుకుంటుంది. అలా ఒకటి రెండు మాసాలు కాదు.. ఏకంగా ఎనిమిదేళ్లుగా ఆమె జీతం తీసుకుంటుంది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. ఆమెపై చర్యలు మాత్రం శూన్యం.
దేశవ్యాప్తంగా చండీపురా వైరస్(Chandipura Virus) విజృంభిస్తోంది. ఇటీవలే గుజరాత్లో పదుల సంఖ్యలో వైరస్ కేసులు బయట పడగా.. తాజాగా నాలుగేళ్ల బాలిక మృతి చెందినట్లు పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ధ్రువీకరించింది.
గత కొన్ని రోజులుగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో చండీపురా వైరస్(Chandipura virus) అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా ఒక్క గుజరాత్(gujarat)లోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధి ప్రభావం కనిపిస్తోంది.
అటవీ ప్రాంత గ్రామాల్లో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు ఏనుగులు, పులులు, సింహాలు జనావాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తుంటాయి. మరికొన్నిసార్లు..
వడోదరలో ఓ పాఠశాల తరగతి గదిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నగరంలోని వాఘోడియా రోడ్డులోని శ్రీ నారాయణ్ గురుకుల పాఠశాల మొదటి అంతస్తులో శుక్రవారం రోజు ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేసే సమయంలో తరగతి గది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఓ విద్యార్థికి గాయాలు అయ్యాయి.
గుజరాత్లోని గోద్రాలో 2002లో జరిగిన అల్లర్ల(2002 Gujarat riots) సమయంలో బిల్కిస్ బానోపై(Bilkis Bano case) అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని చంపిన కేసులో దోషులకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. దోషులు రాధేశ్యామ్ భగవాన్దాస్, రాజుభాయ్ బాబులాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లోని 49 జిల్లాలతో రాష్ట్రం ఏర్పాటు చేయాలని రాజస్థాన్ గిరిజన సమాజం కోరుతోంది. ఇందులో మెజార్టీ జిల్లాలను రాజస్థాన్ నుంచి అడుగుతోంది. రాజస్థాన్లో 33 జిల్లాలు ఉండగా 12 జిల్లాలను ఇవ్వాలని స్పష్టం చేసింది. కొత్త రాష్ట్రం కోసం ఆదివాసి పరివార్ సహా 35 గిరిజన సంఘాలు ఉద్యమ బాట పట్టాయి.
కరోనా వైరస్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. రకరకాల వేరియెంట్లతో తన పంజా విసురుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో మరిన్ని ప్రాణాంతక వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ..
దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు రోజురోజుకీ పెరిగిపోతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా గుజరాత్లోని ఓ సంఘటన నిలిచింది. ఓ ప్రైవేటు కంపెనీలో 10 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకి పిలవగా 50 కాదు 100 కాదు ఏకంగా 1,800 మంది నిరుద్యోగులు క్యూ కట్టారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ప్రతిపక్ష కాంగ్రెస్(Congress) తీవ్రంగా స్పందించింది.