Home » GST
క్యాన్సర్ రోగులు వాడే మందులపై జీఎస్టీ(GST)ని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) నిర్ణయించారు. జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది.
నేడు (సెప్టెంబరు 9న) 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి అనేక రాష్ట్రాల ఆర్థిక మంత్రులతోపాటు పలువురు హాజరుకానున్నారు. ఈ క్రమంలో బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు సహా పలు అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూ.2వేలలోపు లావాదేవీలపై జీఎస్టీ విధించమని చెప్పిన మోదీ సర్కారు ఇప్పుడు ఆ భారం మోపేలా ఉంది.
కేంద్ర ఆర్థిక శాఖ ఆగస్టు నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్ల(GST Collections) గణాంకాలను ఆదివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాల వారీగా ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.
ఆగస్టు 2024లో GST వసూళ్లకు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఈసారి ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు 10 శాతం పెరిగి రూ.1.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో ఆగస్టు 2023లో జీఎస్టీ వసూళ్లు రూ.1.59 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఆరోగ్య బీమా ప్రీమియంపై పెద్ద మొత్తంలో జీఎస్టీ వసూలు అవుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది. అలాగే ఇది ఏటేటా పెరుగుతున్నట్టు స్పష్టమైంది.
‘రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వడ్డీలు, అసలుకే పదేళ్లలో రూ.2.90 లక్షల కోట్లు చెల్లించాలి. ఇప్పుడు బహిరంగ మార్కెట్ నుంచి కొత్తగా అప్పులు తెచ్చినా.. వచ్చే ఆ మొత్తం నుంచి 76.73ు పాత అప్పుల అసలు, వడ్డీలకే చెల్లించే పరిస్థితి. సర్కారుకు నికరంగా మిగిలే నిధులు 23.27ు మాత్రమే’’ అని కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తీవ్రస్థాయిలో ఆక్షేపించింది.
రుణాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తూర్పారబట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వరంగ కార్పొరేషన్ల కోసం తీసుకున్న పూచీకత్తు రుణాల వివరాలను గోప్యంగా ఉంచిందని ఆరోపించింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కోసం తీసుకున్న రుణాల వివరాలనూ బహిర్గతపర్చలేదని దుయ్యబట్టింది.
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన రూ. 1400 కోట్ల వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణం కేసు పూర్తిస్థాయిలో సీఐడీకి బదిలీ అయ్యింది. తొలుత హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఈ కేసును నమోదు చేయగా.. తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో చోటుచేసుకున్న రూ.1,400 కోట్ల వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణం కేసు దర్యాప్తును సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) చేపట్టనుంది.