Home » Group-1
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ జితేందర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీలకు ప్రత్యేక బృందాలు మోహరిస్తున్నట్లు వెల్లడించారు.
గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయడం కుదరని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఆదివారం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన, ప్రతిపక్షాల విమర్శలతో అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం
‘‘గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ల కోసం కలిసేందుకు వస్తే అనుమతించనివాళ్లు ఇప్పుడు అభ్యర్థులను పార్టీ కార్యాలయానికి పిలిచి మాట్లాడుతున్నారు. అశోక్ నగర్కు కూడా వెళుతున్నారు.
జీవో నెంబర్ 29ని రద్దు చేసిన తరువాతే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలంటూ గ్రూప్ వన్ అభ్యర్థులు నిర్వహించిన చలో సచివాలయం ఉద్రిక్తతకు దారితీసింది.
రాష్ట్రంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని, ఇందులో భాగంగానే జీవో 29 జారీ అయ్యిందని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు.
బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టి వివాదాలు సృష్టిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 29పై అనవసర అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు. కొంతమంది రాజకీయ నేతలు 33,383 మంది అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న పనిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కోర్టు దిక్కరణకు పాల్పడుతున్నారని అన్నారు.
నిరుద్యోగుల ఆందోళనపై బీఆర్ఎస్ కుట్ర చేసిందని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ర్యాలీలో చొరబడి గొడవలు సృష్టించాలని బీఆర్ఎస్ నేతలు చూశారని అన్నారు.నిరుద్యోగుల ముసుగులో గొడవలు సృష్టించాలనుకున్నారని విమర్శించారు.
Telangana: జీవో నెంబర్ 29ని రద్దు చేసి జీవో నెం 55ను అమలు చేయాలంటూ నిరుద్యోగులు శనివారం ఆందోళనలకు పిలుపునిచ్చారు. వీరి నిరసనకు కేంద్రమంత్రి బండి సంజయ్ మద్దతు తెలిపారు. బండి సంజయ్తో పాటు బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున అశోక్నగర్ చేరుకుని ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ నిరసనకు దిగారు.
Telangana: గ్రూప్ 1 పరీక్షల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని డీజీపీ జితేందర్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్ల మీదికి వచ్చి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోమని స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి నగరంలోని అశోక్ నగర్ లైబ్రరీకి బండి సంజయ్ భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఇందులో సంజయ్ తో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ను కలిసిన గ్రూప్-1 బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు.