Home » Group-1
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు (Group-1 prelims exam) ఇవాళ (జూన్ 9న) ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 31జిల్లాల్లో 4లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఆదివారం నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. సుమారు 4.03లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రేపు (జూన్ 9న) గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను(group 1 prelims exam) నిర్వహించనుంది. జూన్ 9న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఈ నెల 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష 2024 కోసం హాల్ టిక్కెట్లను(Hall Tickets) కాసేపట్లో అధికారులు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఈ రిక్రూట్మెంట్ పరీక్ష కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ tspsc.gov.inను సందర్శించి TSPSC గ్రూప్ 1 హాల్ టికెట్ 2024ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ(Telangana)లో ఎట్టకేలకు జూన్ 9న గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్(Group 1 Prelims Exam) జరగనుంది. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హాయంలో రెండు సార్లు ఎగ్జామ్ నిర్వహించగా, రెండు సార్లు పేపర్ లీక్ అయిన నేపథ్యంలో పరీక్షను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి నిబంధనలను మరింత కఠినతరం చేశారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.
గ్రూపు-1 పోస్టుల భర్తీలో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందుగానే అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
Andhrapradesh: గ్రూప్ 1 పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మార్చి 17వ తేదీన నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ఫలితాలను గత రాత్రి విడుదల చేశారు. అయితే రాత్రి పూట ఫలితాల విడుదలపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి అభ్యంతరం తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అర్థరాత్రి గ్రూప్స్1 పరీక్షల ఫలితాలు విడుదల చేయడం వెనుక ఆంత్యర్యం ఏంటి అని ప్రశ్నించారు. అలాగే ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం తగ్గడంపై కూడా టీడీపీ నేతల విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను వెల్ల డించింది. 1:100 నిష్పత్తిలో రిజల్ట్స్ రిలీజ్ చేసింది. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షకు(APPSC Group 1 Exam) సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పరీక్షలపై విచారణ ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు(AP High Court). అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి(Single Judge) ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలపై గతంలో స్టే విధించింది డివిజనల్ బెంచ్.