• Home » God

God

GOD : శ్రీవారి సేవలో ఒకరోజు

GOD : శ్రీవారి సేవలో ఒకరోజు

సాయి ట్రస్టు ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని శ్రీ7 కన్వెన్షన హాల్‌లో శనివారం శ్రీవారి సేవలో ఒకరోజు పేరుతో వెంకటేశ్వర వైభవం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కల్యాణోత్సవంతో పాటు వివిధ సేవలను నిర్వహించారు. ఈనేపథ్యంలో శనివారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం స్నపన తిరుమంజనం, అష్టదళ పద్మార్చన, తోమాల సేవ, పుష్పయాగం, తిరుప్పాడ సేవ, ఏడుశనివారాల వ్రతం, హనుమంత వాహన సేవ, నిర్వహించారు.

Immersion Festival : నిమజ్జన  శోభ

Immersion Festival : నిమజ్జన శోభ

అనంతపురం నగరంలో ఐదురోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు బుధవారం గంగమ్మ ఒడికి చేరారు. అంతకు మునుపు మండపాల వద్ద పెద్దఎత్తున అన్నదానం చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సప్తగిరి సర్కిల్‌లోని వినాయక్‌ చౌక్‌ వరకూ శోభాయాత్రలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి దారిపొడవునా భక్తులు బారులు తీరారు. ఆకట్టుకునే వేషధారణలతో రంగులు చల్లుకుంటూ యువత ఉత్సాహంగా వేడుకలలో పాల్గొంది. వినాయక్‌ ...

GOD : సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు

GOD : సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు

మండల పరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వా మి ఆలయంలో ఆదివారం ప్ర త్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా జిల్లా నలుమూలల నుం చి వందలాదిమంది భక్తులు త రలివచ్చి స్వామివారిని దర్శించు కున్నారు.

GOD : ఘనంగా ఏడు శనివారాల వ్రతం

GOD : ఘనంగా ఏడు శనివారాల వ్రతం

నగరంలోని పలు ఆలయాల్లో శనివారం ఏడుశనివారాల వ్రతాన్ని కనులపండువగా నిర్వహించారు. ఏడు శనివారాల్లో అనివార్య కారణాలవల్ల పాల్గొన లేని మహిళలు కోసం 8వ వారం వ్రతం నిర్వహించడం ఆనవా యితీగా వస్తోంది.

VINAYAKA CHAVITI : వినాయక మండపాలు సిద్ధం

VINAYAKA CHAVITI : వినాయక మండపాలు సిద్ధం

వినాయక చవితిని పురస్కరించుకుని హిందూపురంలో విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు మండపాలను సిద్ధం చేశా రు. గతంలో ఎన్నడూలేని విధంగా భారీ ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేయ నున్నారు. కరోనా తరువాత ఎక్కువ సంఖ్యలో విగ్రహాల ఏర్పాటు ఈసారి జరుగనున్నట్లు పోలీసుల వద్ద అనుమతులను బట్టి తెలుస్తోంది.

SP RATNA : శాంతి పురంగా పేరుతెద్దాం

SP RATNA : శాంతి పురంగా పేరుతెద్దాం

హిందూపురాన్ని శాంతి పురంగా పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. వి నాయక నిమజ్జనం శాంతి యుతంగా జ రపాలని సూచించారు. స్థానిక కేవీఆర్‌ ఫంక్షన హాల్‌లో ఎస్పీ బుధవారం హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు వివిధ మతాలు కులస్తులతో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లో హైదరాబాద్‌ తరువాత హిందూపురం వినాయక ని మజ్జనం రెండో స్థానంలో ఉందన్నారు.

JATARA : భక్తిశ్రద్ధలతో దుగ్గిలమ్మ జాతర

JATARA : భక్తిశ్రద్ధలతో దుగ్గిలమ్మ జాతర

పట్టణంలోని మధు థియేటర్‌ వెనుక నున్న ఆలయంలో దుగ్గిలమ్మ దేవత జాతరను మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వ హించారు. అమ్మవారికి ఉదయాన్నే పంచామృతాభిషేకం, కుంకుమార్చన, పుష్పా లంకరణ, వెండి కవచధారణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి వేపాకు, చీర, ముడుపులు చెల్లించారు. అనంతరం బలిదాన కార్యక్రమం నిర్వ హించారు.

GANESH FESTIVAL : మట్టి వినాయకుడిని పూజిద్దాం

GANESH FESTIVAL : మట్టి వినాయకుడిని పూజిద్దాం

మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షి ద్దాం అంటూ స్ధానిక మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషషర్‌ జబ్బర్‌ మీయా ఆధ్వర్యంలో పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. రానున్న వినా యక చవతి పండుగ సందర్భంగా ప్రజలు, రసాయనాలతో చేసిన వినాయక ప్రతిమలు కాకుండా మట్టి వినాయకులను మాత్రమే పూజించాలని ఆయన కోరారు.

VINAYAKA FESTIVAL : వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలి

VINAYAKA FESTIVAL : వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలి

వినాయకచవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవా లని ఆర్డీఓ రాణిసుస్మిత, డీఎస్పీ రవిబాబు తెలిపారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఎంపీడీఓలు, సీఐలు, మున్సిపల్‌ కమిషనర్‌, తహసీల్దార్లతో వారు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

MAREMMA FESTIVAL : ఘనంగా మారెమ్మ ఉత్సవాలు

MAREMMA FESTIVAL : ఘనంగా మారెమ్మ ఉత్సవాలు

గుమ్మఘట్ట మండల సరిహద్దులో కర్ణాటక ప్రాంతంలోని గౌరసముద్రం అడ వి ప్రాంతంలో వెలసిన మారెమ్మ ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహిం చారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాది మంది హాజరై మొక్కులు తీర్చుకుంటారు. ఒక్క రోజు మధ్యాహ్నం జరిగే ఉత్సవాలకు అనాది చరిత్ర ఉంది. సాయంత్రానికి ఈ జాతరలో ఒక్కరూ ఉండరు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి