Home » Gachibowli
కంచ గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం వేలానికి పెట్టిన 400 ఎకరాలు అటవీ భూమి అని, దానిని విక్రయించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనపై నల్లగొండ జిల్లా అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఓ ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేయగా, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్తోపాటు డిపార్ట్మెంటల్ అధికారి(డీవో)ని విధుల నుంచి తొలగించారు.
ఆర్థిక వనరుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ చేసి, వేలం వేయాలని నిర్ణయించిన రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబరు 25 పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమితో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ)కు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐఐఐటీ) జంక్షన్ నుంచి ఔటర్ రింగు రోడ్డు (ఎగ్జిట్ నంబర్ 1)కు దగ్గర్లో ఉన్న జీఏఆర్ రోటరీ వరకు 5 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్ నిర్మించాలని సర్కారు భావిస్తోంది.
త్వరలో హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ బ్రాండ్ను విశ్వవేదిక మీద చాటాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నప్పుడు నిర్వాహక రాష్ట్రంవైపు సహజంగానే ప్రపంచ దేశాలన్నీ చూస్తాయి.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోది. నిరుడు అక్టోబరులో నాలుగు విభాగాల్లో సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయం..
Hyderabad Gun Firing : గచ్చిబౌలి ప్రిజం పబ్బు కాల్పుల కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ప్రిజం పబ్కు తరుచూ బత్తుల ప్రభాకర్ వస్తున్నట్లు తెలిసిందని.. దీంతో అతడిని పట్లుకునేందుకు వెళ్లడంతో కాల్పులు జరిపాడని మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ వెల్లడించారు. బీహార్ నుంచి బత్తుల ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని అన్నారు.
అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులపై ఓ దొంగ కాల్పులు జరిపిన ఉదంతమిది. గచ్చిబౌలి ఠాణా పరిధిలోని ప్రిజమ్ పబ్లో జరిగిన ఈ ఘటనలో ఓ హెడ్కానిస్టేబుల్కు బుల్లెట్ గాయాలయ్యాయి.
17వ అంతస్తు నుంచి కిందపడి కార్మికుడు మృతిచెందిన ఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గచ్చిబౌలి అంజయ్యనగర్లో నివాసముంటున్న రాకేష్ అలాం (23) మాదాపూర్లోని వాసవి స్కైల కన్స్ట్రక్షన్ సైట్(Vasavi Skyla Construction Site)లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బు
రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని సత్వా ఎలిగ్జిర్ అద్దాల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 6 గంటల సమయంలో ఐదంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఐటీ కారిడార్ ఉలిక్కిపడింది.