Home » Flood Victims
భారీ వర్షాలు వరదలతో అఫ్గానిస్తాన్లో మరణించిన వారి సంఖ్య 315కి పెరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. మరో పదహారు వందల మంది గాయాలపాలైయ్యారని వెల్లడించాయి. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నాయి.
అఫ్గానిస్థాన్లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. దీంతో 200 మందికి పైగా ప్రజలు మరణించారని ఐక్యరాజ్య సమితి శనివారం వెల్లడించింది. దీంతో ఉన్నతాధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారని తెలిపింది.
నిత్యం ఎండలతో అల్లాడిపోయే దుబాయ్ ( Dubai ) లో వరదలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్తో సహా చాలా ప్రదేశాలు నీట మునిగాయి.
ఎడారి నేలను తుపాన్ వణికిస్తున్నాయి. ఏప్రిల్ 15 సాయంత్రం నుంచి తుపాన్(Dubai Cyclone) ధాటికి కురుస్తున్న భీకర వర్షాలతో దుబాయి చిగురుటాకులా వణుకుతోంది. ఆకస్మిక వరదల వల్ల దాదాపు 18 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.