Home » Fake Propaganda
ఇది అసలే ఎన్నికల సమయం.. ఓట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారివి. ప్రజలను నమ్మించేందుకు అనేక మార్గాలు.. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఫేక్ ప్రచారం ఎక్కువైంది. ఏది సత్యమో.. ఏది అసత్యమో తెలుసుకునేలోపు అబద్ధం అందరినీ చేరుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వచ్చాక.. సాంకేతికతను ఉపయోగించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అది ఫేక్ అని గ్రహించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలకు అంతు లేకుండా పోయింది. ఫేక్ ప్రచారంలో అధికార వైసీపీ ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో విధంగా అసత్య ప్రచారాలతో ప్రజల మైండ్సెట్ మార్చాలనే ప్రయత్నంలో భాగంగా ఫేక్ పబ్లిసిటీకి వైసీపీ సోషల్ మీడియా విభాగం శ్రీకారం చుట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.