Home » EVM Machine
నగరంలోని టవర్క్లాక్ సమీపంలో ఉన్న పాత ఆర్డీఓ కార్యాలయం ఆవరణంలో ఉన్న ఈవీఎంల గోడౌనతో పాటు జేఎనటీయూలోని ఈవీఎం గోడౌన్లను బుధవారం జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ పరిశీలించారు. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను కలెక్టర్ పరిశీలిం చారు.
‘పాల్వాయిగేటు వంటి సెన్సిటివ్ పోలింగ్ బూత్లో ఒకేఒక హోంగార్డును పెట్టి నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతా ఉందని చెప్పడం కోసం పిన్నెల్లి పోలింగ్ బూత్లోకి వెళ్లి ఈవీఎం పగలగొట్టే కార్యక్రమం చేశా రు.
‘నా క్టైంట్ దొంగతనాలు చేశాడు. అయితే ఉరి శిక్ష వేస్తారా? దోపిడీలు చేశాడు... అయితే ఉరి శిక్ష వేస్తారా? బాంబులు కూడా వేశాడు. అయితే, ఉరి శిక్ష వేసేస్తారా?’... అదేదో సినిమాలో కమెడియన్ లాయర్ తన క్లైంటునే ఇలా కోర్టులో ఇరికించేస్తాడు.
తెలంగాణలో 2029వరకూ కాంగ్రెస్ పార్టీ(Congress Party)నే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ఐదేళ్లకోసారి, తెలంగాణలో పదేళ్లకోసారి అధికారం మారే ట్రెండ్ ఉందన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయెుచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంటులో ఈవీఎంల అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఈవీఎంల విశ్వసనీయతను సమాజ్వాదీ పార్టీ చీఫ్, కన్నౌజ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ లోక్సభలో మంగళవారం ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో తమ పార్టీ 80 సీట్లు గెలిచినా సరే తాను ఈవీఎంలను నమ్మేది లేదని అన్నారు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు(మే 13న), మరుసటి రోజు జరిగిన దాడులకు సంబంధించిన కేసుల్లో అరెస్టయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కొత్త రాగం అందుకున్నారు. పోలీసులు పిన్నెల్లిని అదుపులోకి తీసుకోలేదని...
దేశవ్యాప్తంగా 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని 92 పోలింగ్ కేంద్రాలు, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 26 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వాటి విశ్వసనీయతపై ఆందోళన మొదలైంది.
ఈవీఎం(EVM)లపై మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan) అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (MLA Gorantla Butchaiah Chaudhary) అన్నారు. ప్రజలంతా తిరుగుబాటు చేసి ఆయన్ను ఓడించారని, కానీ జగన్ మాత్రం ఈవీఎం వల్లే తాను ఓడిపోయానని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.