Home » Etela rajender
పదేళ్లు అధికారంలో ఉండి.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్.. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి పాతాళానికి పడిపోయింది. ఆరు నెలల వ్యవధిలో ఆ పార్టీ గ్రాఫ్ గణనీయంగా తగ్గిపోంది. మరోవైపు బీజేపీ గ్రాఫ్ అనూహ్యంగా పైకి ఎగబాకింది.
‘‘రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. డబ్బు పంపిణీ చేసినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా ఆ పార్టీ ఓటు బ్యాంకు పెరగలేదు. 8 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించినప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ ఫలితాలు భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనేదానికి సంకేతం.
దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి(Malkajigiri). ఎన్నికలు జరిగిన ప్రతీసారి మార్పు కోరుకుంటోంది. 2008లో డీలిమిటేషన్లో భాగంగా మల్కాజిగిరి కొత్త పార్లమెంట్ నియోజకవర్గంగా పురుడు పోసుకుంది.
ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, రఘనందనరావులు లోక్సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించారు. కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి.. ఎంపీగా బండి సంజయ్ గెలిచారు. హుజురాబాద్, గజ్వేల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈటల ఓడారు. ఇప్పుడు ఈటల మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి.. మెదక్ ఎంపీగా రఘనందనరావు గెలిచారు.
కమలం వికసించింది.. కాంగ్రెస్ మురిసింది.. గులాబీ వాడింది. తెలంగాణలో కమలం, హస్తం పార్టీలు ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ సాధించాయి. ఓట్లు, సీట్లలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. నాలుగు నుంచి ఎనిమిది సీట్లకు పెరగడంతోపాటు ఓట్ల శాతమూ21 శాతానికి ఎగబాకింది. అధికార కాంగ్రెస్ కూడా ఎనిమిది సీట్లలో విజయకేతనం ఎగరేసింది. పదేళ్లపాటు రాష్ట్రంలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ మాత్రం ఈసారి బొక్కబోర్లా పడింది.
వారణాసి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో దిగారు. ఆ క్రమంలో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు తెలంగాణలోని బీజేపీ కీలక నేతలు వారణాసి బాట పట్టారు.
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను టార్గెట్గా చేసుకుని.. ప్రచారంలో దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారాన్ని కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ భుజాన వేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు.
Telangana: ఈనెల 27న ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని... బీజేపీ అభ్యర్థిగా 40 ఏళ్లుగా సిద్ధాంతాన్ని నమ్ముకుని ఎత్తిన జెండా దింపని గుజ్జుల ప్రేమెందర్ రెడ్డిని ఎమ్మెల్సీ బరిలో నిలిపామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆనాడే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించినా నేటికీ అమలు చేయకపోవడం పట్ల వారు బాధతో ఉన్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు చెల్లింపు విధానంతో మళ్ళీ ఆర్టీసీని దివాలా తీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Telangana: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలని ప్రజలు భావిస్తున్నారని బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బీబీ పాటిల్ అన్నారు. కోదాడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో వీరు పాల్గొని ప్రసంగించారు. నల్గొండలో బీజేపీకి డిపాజిట్ రాదు అనేది అవగాహన లేనివారు అహంకారంతో మాట్లాడేవని అన్నారు. ఎన్ని డబ్బులు పెట్టినా ధర్మం న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాకు 5-10 కిలోలు కోత పెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. కల్లాల వద్ద రైతుల కష్టాలు సర్కారుకు పట్టవా..? అని నిలదీశారు. తరుగుతో సంబంధం లేకుండా మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు