Home » Enforcement Directorate
భాగ్యనగరంలో(Hyderabad) భారీ స్కామ్ వెలుగు చూసింది. నిరుద్యోగుల అవసరాలనే ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేసుకున్నారు కేటుగాళ్లు. పార్ట్ టైం ఉద్యోగాల(Part Time Jobs) పేరుతో భారీ మోసానికి తెరలేపారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 524 కోట్లు దోచేశారు కేటుగాళ్లు. ఒక్క హైదరాబాద్లోనే కాదు..
కేంద్రంలోని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ప్రభుత్వంపై బీఆర్ఎస్(BRS) అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్(Krishank) సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో ఏ పార్టీ(Political Party) కూడా ఉండకూడదని ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన..
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కస్టడీని పొడగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో నాలుగు రోజులు కస్టడీ పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ సందర్భంగా కోర్టులో కేజ్రీవాల్ ఉద్వేగభరిత ప్రసంగం చేసినట్లు తెలుస్తోంది.
లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. తన అరెస్ట్ను, ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
డయాబెటిక్తో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, ఈడీ కస్టడీలో ఉన్న ఆయన షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారంనాడు ఆరోపించింది. ఆయన షుగర్ లెవెల్స్ ఒక దశలో 46 ఎంజీ స్థాయికి పడిపోయిందని, ఇది ప్రమాదకరమైన పరిస్థితిని అని వైద్యులు చెబుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ , ఆమె ఐటీ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.
తృణమూల్ కాంగ్రెస్ నేత మహుతా మొయిత్రాను ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసు వెంటాడుతోంది. ఈ కేసులో ఆమెను, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానిని ప్రశ్నించేందుకు ఈనెల 28న తమ ముందు హాజరుకావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు సమన్లు జారీ చేసింది.
అనుమానాస్పద లావాదేవీలతో వేల కోట్ల రూపాయలు దేశం దాటించిన కేసులో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) అధికారులు హైదరాబాద్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్తోపాటు
సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టు నుంచి జైలుకు తరలించారు. కవితకు కోర్టు 14 రోజులపాటు జుడీషియల్ రిమాండ్ విధించడంతో ఢిల్లీ పోలీసు అధికారులు జైలుకు తీసుకెళ్లారు. జైలు వ్యాన్లో ఆమె తరలించారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆమె తీహార్ జైల్లోనే ఉండనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన ఎమ్మెల్యే కవిత(MLC Kavitha) విషయంలో రౌస్ అవెన్యూ(Rouse Avenue Court) కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈడీ కస్టడీ(ED Custody) ముగిసిన నేపథ్యంలో ఆమెకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది ధర్మాసనం.