Home » Enforcement Directorate
ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Case)లో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్(ED Charge Sheet)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పాత్రపై మే 10న పీఎంఎల్ఏ 44, 45సెక్షన్ల కింద సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను ఈడీ దాఖలు చేసింది. తాజాగా దీన్ని స్పెషల్ కోర్టు పరిగణలోకి తీసుకోవడంతో పలు అంశాలు బహిర్గతం అయ్యాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. జ్యుడీషియల్ కస్టడీ ముగియనుండడంతో ఆమెను కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. కవితతోపాటు చరణ్ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లను నిందితులుగా పేర్కొంటూ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ను గత నెల 29న న్యాయమూర్తి అంగీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సుప్రీంకోర్టు గత నెలలో మంజూరు చేసిన మధ్యంతర బెయిలును పొడిగించాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పెట్టుకున్న దరఖాస్తుపై తీర్పును ఢిల్లీ కోర్టు ఈనెల 5వ తేదీకి రిజర్వ్ చేసింది. దీంతో ఈనెల 2వ తేదీన తిరిగి తీహార్ జైలు అధికారుల ముందు కేజ్రీవాల్ లొంగిపోవడం అనివార్యం కానుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ కోసం చేసుకున్న అభ్యర్థనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీవ్రంగా వ్యతిరేకించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోఎమ్మెల్సీ కవితను కష్టాలు వెంటాడుతున్నాయి. ఓవైపు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకు ఉపశమనం కలగకపోవడంతో కవిత తీహార్ జైలులోనే ఉన్నారు. దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్పై రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
లోక్సభ ఎన్నికల(lok sabha election 2024) నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్ను 7 రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యంతో బాధపడుతున్నారని అందుకే పొడిగించాలని చెప్పినట్లు తెలుస్తోంది.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్యే కవిత(MLC Kavitha) బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో(Delhi High Court) శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలను సోమవారానికి వాయిదా వేసింది ధర్మాసనం. ఈడీ అరెస్ట్ చేసిన విధానం.. కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత తరఫున న్యాయవాది కోర్టుకు ..
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎ్ఫసీఆర్ఏ) నిబంధనలకు విరుద్ధంగా ఆమ్ ఆద్మీ పార్టీ 2014-2022 నడుమ రూ.7 కోట్ల మేర విదేశీ నిధులను అందుకున్నట్టు ఈడీ ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఈడీ గత ఏడాది ఆగస్టులోనే ఒక లేఖ రాసింది.
'ఆమ్ ఆద్మీ పార్టీ' చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) వల బిగుసుకుంటోంది. 2014-2022 మధ్య రూ.7.08 కోట్ల విదేశీ నిధులను 'ఆప్' అందుకుందంటూ హోం మంత్రిత్వ శాఖకు ఈడీ రిపోర్డ్ చేసింది.
ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా ఓటింగ్కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టాలంటూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది.