Home » Enforcement Directorate
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు(Mohammad Azharuddin) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) గురువారం సమన్లు పంపింది. అజారుద్దీన్ హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనీ లాండరింగ్ జరిగిందని, దాదాపు రూ.20 కోట్ల అవకతవలు జరిగాయని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై సెప్టెంబర్ 31న పోలీస్ ఎఫ్ఐఆర్తో సమానమైన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR)ను ఈడీ నమోదు చేసింది. తన భార్యకు 14 స్థలాలను 'ముడా' కేటాయించడంలో అవకతవకలు జరిగాయన్న అరోపణలను సిద్ధరామయ్య ఎదుర్కొంటున్నారు.
ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ సామాజిక కార్యకర్త టి.జె అబ్రహం గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
Telangana: సాహితీ ఇన్ఫ్రా కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దాదాపు 1500 కోట్లు వసూలు చేసి సాహితీ ఇన్ఫ్రా బిచాణా ఎత్తివేసింది. సాహితీ ఇన్ఫ్రా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సీసీఎస్ పోలీసులు.. ఆస్తులను అటాచ్ చేశారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో అవకతవకలకు పాల్పడిన కేసులో నీరవ్ మోదీ, ఆయన అంకుల్ మెహుల్ చోక్సీ నిందితులుగా ఉన్నారు. 2018లో ఈ కేసు వెలుగుచూసింది.
రాంచీ ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్ మధుకాన్ ప్రాజెక్టు కేసులో ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. పీఎంఎల్ఏ యాక్ట్ 2002 ప్రకారం ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. రాంచీ ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్, దాని డైరెక్టర్లపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఢిల్లీ వక్స్ బోర్డ్లో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు అరెస్టు చేసింది.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా(Bhupendra Singh Hooda)కు సంబంధించిన భూ కుంభకోణంలో ఈడీ కీలక చర్యలు తీసుకుంది. హుడా తదితరులపై మనీలాండరింగ్ కేసులో రూ.834 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు ఎస్.జగద్రక్షకన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజిమెంట్ యాక్ట్ కేసులో ఆయనకు, ఆయన కుటుంబానికి రూ.908 కోట్ల జరిమానా విధించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (KTR) ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. తనతో పాటు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలను కూడా కేటీఆర్ తీసుకెళ్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వీరంతా హస్తినకు బయల్దేరి వెళ్లనున్నారు...