Home » Enforcement Directorate
తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు ఎస్.జగద్రక్షకన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజిమెంట్ యాక్ట్ కేసులో ఆయనకు, ఆయన కుటుంబానికి రూ.908 కోట్ల జరిమానా విధించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (KTR) ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. తనతో పాటు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలను కూడా కేటీఆర్ తీసుకెళ్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వీరంతా హస్తినకు బయల్దేరి వెళ్లనున్నారు...
ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్ పేరుతో రూ.400 కోట్ల మేర మోసం చేసిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఈడీ తెలిపింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొత్త డైరెక్టర్గా రాహుల్ నవీన్ బుధవారం నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ధ్రువీకరించింది. పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల పాటు, లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఈడీ డైరెక్టర్గా ఆయన కొనసాగుతారని తెలిపింది.
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ నుంచి జస్టిస్ సంజీవ్ కుమార్ తప్పుకున్నారు. భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఎన్ఫోర్స్మెంట్(ED) దాఖలు చేసిన కేసుల విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
లోక్సభ ఎన్నికల సమయంలో కొందరు ఉన్నతాధికారుల అత్యుత్సాహం మండల పరిషత్ అభివృద్ధి అధికారుల(ఎంపీడీవోలు)కు శాపంగా మారింది.
పెట్టుబడులకు అధిక లాభాల పేరుతో లక్షలాది మంది డిపాజిటర్ల నుంచి రూ.వేల కోట్లు కొట్టేసిన కేసులో హీరా సంస్థల అధినేత్రి నౌహీరా షేక్కు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే పరంపర కొనసాగుతోంది.
తక్కువ పెట్టుబడికి ఎక్కువ మొత్తంలో చెల్లింపుల పేరుతో లక్షలాది మంది నుంచి రూ.వేల కోట్ల డిపాజిట్లు సేకరించి మోసగించిన హీరా సంస్థల అధినేత్రి నౌహీరా షేక్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
హీరా గోల్డ్ సంస్థల(Heera Group) కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న నౌహీరా షేక్కు మరో షాక్ తగిలింది. ఈ కేసులో ఇప్పటికే వేగం పెంచిన ఈడీ.. నౌహీరా షేక్కు సంబంధించిన ఆస్తులను ఒక్కొక్కటిగా అటాచ్ చేస్తూ వెళ్తోంది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనపై దాడులు చేసేందుకు సిద్ధమవుతోందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్సభలో ‘చక్రవ్యూహం’ అంటూ తాను చేసిన ప్రసంగం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదన్నారు.