Home » Enforcement Directorate
ప్రీలాంచ్ పేరుతో ఫ్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పలువురు వినియోగదారుల నుంచి రూ. వేల కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఎండీ లక్ష్మి నారాయణపై ఈడీ కేసు నమోదు చేసింది. రూ.2 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సాహితీ గ్రూప్పై ఈడీ మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోంది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది. శుక్రవారం ఏకంగా 9 రాష్ట్రాల్లోని 44 ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు(Mohammad Azharuddin) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) గురువారం సమన్లు పంపింది. అజారుద్దీన్ హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనీ లాండరింగ్ జరిగిందని, దాదాపు రూ.20 కోట్ల అవకతవలు జరిగాయని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై సెప్టెంబర్ 31న పోలీస్ ఎఫ్ఐఆర్తో సమానమైన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR)ను ఈడీ నమోదు చేసింది. తన భార్యకు 14 స్థలాలను 'ముడా' కేటాయించడంలో అవకతవకలు జరిగాయన్న అరోపణలను సిద్ధరామయ్య ఎదుర్కొంటున్నారు.
ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ సామాజిక కార్యకర్త టి.జె అబ్రహం గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
Telangana: సాహితీ ఇన్ఫ్రా కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దాదాపు 1500 కోట్లు వసూలు చేసి సాహితీ ఇన్ఫ్రా బిచాణా ఎత్తివేసింది. సాహితీ ఇన్ఫ్రా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సీసీఎస్ పోలీసులు.. ఆస్తులను అటాచ్ చేశారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో అవకతవకలకు పాల్పడిన కేసులో నీరవ్ మోదీ, ఆయన అంకుల్ మెహుల్ చోక్సీ నిందితులుగా ఉన్నారు. 2018లో ఈ కేసు వెలుగుచూసింది.
రాంచీ ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్ మధుకాన్ ప్రాజెక్టు కేసులో ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. పీఎంఎల్ఏ యాక్ట్ 2002 ప్రకారం ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. రాంచీ ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్, దాని డైరెక్టర్లపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఢిల్లీ వక్స్ బోర్డ్లో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు అరెస్టు చేసింది.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా(Bhupendra Singh Hooda)కు సంబంధించిన భూ కుంభకోణంలో ఈడీ కీలక చర్యలు తీసుకుంది. హుడా తదితరులపై మనీలాండరింగ్ కేసులో రూ.834 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.