Home » Enforcement Directorate
ఫార్ములా ఈ కారు రేసు కేసుపై ఈడీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్పై నమోదైన కేసు వివరాలు.. ఎఫ్ఐఆర్తోపాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత బదిలీ చేశారో వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది.
ఐఏఎస్ అధికారి అమేయకుమార్పై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. మహేశ్వరం మండలం నాగారంలో 50 ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో అమేయకుమార్పై ఈడీ దర్యాప్తు చేపట్టింది.
మేనేజ్మెంట్ కోటాలో పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసిన కేసులో చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలకు చెందిన రూ.5.34 కోట్ల మేరకు ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్బోర్డుకు చెందిన భూమి చేతులు మారడంపై ఓ సంస్థతోపాటు నలుగురు వ్యక్తులకు భూదాన్ బోర్డు కార్యదర్శి నోటీసులు పంపారు.
గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా అమోయ్కుమార్ పనిచేసిన కాలంలో భూ కుంభకోణాలు భారీగా జరిగినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్వరం మండలం నాగారంలోని 42 ఎకరాల భూదాన భూముల అన్యాక్రాంతంపై నమోదైన కేసులో ఈడీ విచారణ జరుపుతుండగా.. మరికొన్ని భూముల అక్రమాలపై కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
అగ్రిగోల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నాంపల్లి ఎంఎ్సజే ప్రత్యేక కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
Telangana: భూదాన్ భూమి అన్యాక్రాంతం వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్, తహశీల్దార్ జ్యోతిని విచారించిన ఈడీ.. తాజాగా ఆర్డీవో వెంకటాచారిని విచారిస్తోంది. ఈ భూమి విషయంలో అధికారులు కోట్లు పొందారని ఈడీ అనుమానిస్తోంది.
భూ బదలాయింపుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసుల పరంపర కొనసాగుతోంది. ఎమ్మార్వో జ్యోతి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా భూ బదలాయింపుల కేసులో అవసరమైన ఒక్కొక్కరికి ఈడీ నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తోంది.
భూ ఆక్రమణల బాధితులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి క్యూ కడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం భూదాన్ భూముల బదలాయింపులో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారడంతో మనీలాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేపట్టింది.