Home » Encounter
దోడా జిల్లాలోని శివగడ్- అస్సాడ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల నక్కి ఉన్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భారత సైన్యంతోపాటు జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా అటవీ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో ఈ రోజ ఉదయం ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో కెప్టెన్ దీపక్ సింగ్ మృతి చెందారు.
జమ్మూ కశ్మీర్(jammu kashmir)లోని కుప్వారా జిల్లా(kupwara district) కమ్కారీ సెక్టార్లో పాకిస్థాన్ 'బోర్డర్ యాక్షన్ టీమ్' (BAT) జరిపిన దాడిని భారత సైన్యం శనివారం భగ్నం చేసింది. ఇదే సమయంలో జరిగిన ఎన్కౌంటర్(Encounter)లో, ఓ సైనికుడు వీరమరణం చెందగా, కెప్టెన్తో సహా మరో నలుగురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు.
జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. జవాన్ నాయక్ దిల్వార్ ఖాన్ ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఒక ఉగ్రవాదానికి భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
పంజాబ్లోని భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద నాలుగు చైనా తుపాకీలు, 50 రౌండ్ల పాకిస్థాన్ బులెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రత సిబ్బంది ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు.
జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు భారత ఆర్మీ సైనికులు అశువులు బాయడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పదేపదే భద్రతా లోపాలు తలెత్తడానికి కేంద్ర బాధ్యత వహించాలని అన్నారు. దేశానికి, వీరసైనికులకు కీడు తలబెడుతున్న దుండగులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు.
జమ్మూ కశ్మీర్ దోడా జిల్లాలోని భరద్వాలో జరిగిన ఎన్కౌంటర్లో ఉన్నతాధికారితో సహా నలుగురు సైనికులు మరణించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని జైషే ఈ మహమ్మద్ అనుబంధ సంస్థ కశ్మీర్ టైగర్స్ మంగళవారం ప్రకటించింది.
ఉగ్రవాదులను తుదముట్టించే పోరులో మరో నలుగురు భారత ఆర్మీ సైనికులు అసువులు బాశారు. జమ్మూ కాశ్మీర్లోని దోడాలోఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో జవానులు వీరమరణం పొందారు. సోమవారం రాత్రి దోడా జిల్లాలోని దేసా ప్రాంతంలో జరిగింది.
జమ్మూ కశ్మీర్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ సైనికుడు మృతి చెందాడని ఉన్నతాధికారులు వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్ కుల్గాం జిల్లాలోని మోడర్గమ్ గ్రామంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారంటూ భద్రతా దళాలకు నిఘా వర్గాలు సమాచారాన్ని అందించాయి.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో భాగంగా దోడా జిల్లా బజాద్ గ్రామంలోని గండోహ్ ప్రాంతంలో బుధవారంనాడు ఉదయం 9.50 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక టెర్రరిస్టు హతమయ్యాడు.
జమ్ము కాశ్మీర్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.