Home » Employees
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఉద్యోగులపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. కుప్పం మండల టెక్నీకల్ అసిస్టెంట్ మురుగేష్, చీకటిపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ను అధికారులు విధుల నుంచి తొలగించారు. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ తరుపున కండువా కప్పుకొని ప్రచారం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్, అధికారుల సమావేశనికి వైసీపీ తరుపున హాజరైన మురుగేష్పై ఈసీ చర్యలు తీసుకుంది.
హైదరాబాద్: పోచారం ఐటీ కారిడార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిపై గుర్తు తెలియని యువకులు దాడి చేశారు. అనురాగ్ విశ్వవిద్యాలయం సమీపంలో కారులో వెళ్తున్న టీసీఎస్ ఉద్యోగి కుర్వ నవీన్ కుమార్పై యూనివర్సిటీ వద్ద 8 మంది యువకులు అకారణంగా దాడి చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదేళ్లుగా తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం రాలేదని, వారి ఆవేదన వినేవారే లేక ఇబ్బందులు పడ్డారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. అందుకే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే అంశాన్ని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని తెలిపారు.
పేరుకే ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడు! చేసేది మాత్రం ముఖ్యమంత్రి జగన్ భజన! ఆయనే... రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్ల సంగతి పక్కనపెట్టి... శ్రుతిమించిన స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు...
DA, DR Hike In March: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు(Government Employees) త్వరలో శుభవార్త వినబోతున్నారు. అధికారిక సమాచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్(డీఏ)(DA) మార్చిలో 4 శాతం పెరగనుంది. ఈ పెంపు తరువాత డీఆర్(DR), డీఏ(DA) 50 శాతానికి పైగా చేరుకుంటుంది. సీపీఐ డేటా ఆధారంగా డీఏ, డీఆర్ ఎంత పెంచాలనేది..
ప్రతి అయిదేళ్లకొకసారి ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వడం సాధారణం. ఇది ఆలస్యమైతే మధ్యంతర భృతి(ఐఆర్) ఇవ్వడం సంప్రదాయమే.
Andhrapradesh: మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డిని సెక్రటేరియట్ ముందు ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు అడ్డుకున్నారు. తమ సీపీఎస్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర సచివాలయం ఉద్యోగులు డిమాండ్ చేశారు. అయితే సమావేశానికి వెళ్తున్న తమను అడ్డగించిన ఉద్యోగులపై మంత్రి బొత్స అసహనం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 1, 2024న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సమర్పిస్తారు. బడ్జెట్ ద్వారా ప్రభుత్వం సాధారణ ప్రజలకు గరిష్ట ప్రయోజనాలను అందించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధిపథంలో ఉంచాలని ప్రణాళికలను తయారు చేస్తుంది.
దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ ఉద్యోగుల(software Engineers) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు సంస్థలో పనిచేస్తున్న అందరు 5 లక్షల మంది ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.
అమరావతి: ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలను మరోసారి చర్చలకు పిలిచింది. శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణలతో అంగన్వాడీ నాయకత్వం సమావేశం కానుంది.