Home » Employees
తెలంగాణ దక్షిణ మండల విద్యుత్ సంస్థలో అవినీతికి పాల్పడిన అధికారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. డిజిటల్ చెల్లింపుల ద్వారా లంచాలు తీసుకున్న వ్యవహారం బయటపడటంతో 8 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు పడింది..
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు, భవనాల శాఖ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ అంచనాలు ఉండాలని అధికారులను ఆదేశించారు.
భాగ్యనగర పరిశుభ్రతలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ని పరిశుభ్రంగా ఉంచాలని దిశానిర్దేశం చేశారు.
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పించింది. ఉపవాసాలు పాటించే ఉద్యోగుల సౌకర్యార్థం సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పెన్షనర్లు తమ పెన్షన్ కోసం ప్రతి ఏడాది లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది . ఇప్పుడు జీవన్ ప్రమాణ్ డిజిటల్ సిస్టమ్ ద్వారా ఇంటి నుంచే సులభంగా సబ్మిట్ చేయవచ్చు. బ్యాంక్ లేదా పెన్షన్ ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేదు.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అక్టోబరు జీతాల చెల్లింపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగులకు జీతం చెల్లించొద్దని నిర్ణయం తీసుకుంది.
‘ఏ ప్రభుత్వానికి మనం తొత్తులు కాదు. హక్కుల సాధనే ధ్యేయంగా ముందుగా సాగాలి’ అని పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నేతలు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్జీఓ హోంలో సోమవారం ఏపీఎనజీజీఓ సంఘం సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీఎన్జీఓ నగర అధ్యక్ష, కార్యదర్శులు మనోహర్రెడ్డి, శ్రీధర్బాబుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, ఏపీఎనజీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జక్కుల మాధవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఆరేళ్ల పాటు ఒకే క్యాడర్లో పని చేసిన వారికి స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని ఎమ్మిగనూరు వార్డు సచివాలయ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు గోవిందురాజులు కోరారు.
తిరుపతి కేంద్రంగా ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే జాతీయమహిళా సాధికరత సదస్సు విజయవంతానికి లైజన్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూచించారు.
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెన్షన్ల పంపిణీని కొంతమంది ఉద్యోగులు అభాసుపాల్జేశారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.