Home » Employees
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తును తుది దశకు తెచ్చింది. ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నట్టు ప్రకటించింది.
గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల వేతనాలు త్వరలో పెరగనున్నాయి. వారి మూల వేతనంపై 50ు వేతనం పెంచాలని రాష్ట్ర సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
గత తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నేటి నుంచి చేపట్టనున్నారు. నిరుడు సెప్టెంబరు-3న వీటిని చేపట్టాలని గత ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినప్పటికీ.. పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడం, విషయం కోర్టుకు వెళ్లడంతో వాయిదాపడింది.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వణికించాయి. ఊహించినట్లుగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటెత్తారు. వైసీపీ అభ్యర్థులు సైతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తగ్గించేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. ఓట్లను ఇనవ్యాలీడ్ చేయించేందుకు కోర్టులకు ఎక్కారు. అన్ని అడ్డంకులను దాటుకుని.. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయినా, ఇన వ్యాలీడ్ ఓట్లు భారీగానే నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 3,582 పోస్టల్ ఓట్లు చెల్లలేదు. ...
నీటిపారుదలశాఖలో శుక్రవారం కీలక అధికారులు పదవీ విరమణ చేయనున్నారు. ఈఎన్సీ(ఓ అండ్ఎం, క్వాలిటీ కంట్రోల్)గా పని చేస్తున్న భూపతిరాజు నాగేంద్రరావుతోపాటు ఎస్ఈలు టి.వెంకటేశ్వరరావు, ఎ.మురళీధర్, ఎస్.మురళీకృష్ణ, ఈఈలు జి.శ్రీనివాస్, కె.రాములు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(డీఈఈలు) చెన్నం రవీంద్రారెడ్డి, మేళ్లచెరువు వెంకట రామశర్మ రిటైర్ కానున్నారు.
అసైన్డ్ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని నల్లగొండ జిల్లా నిడమనూరులో పనిచేసిన ముగ్గురు తహసీల్దార్లు, ఓ వీఆర్వోను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిడమనూరు మండలం తుమ్మడం శివారులోని 9 ఎకరాల ప్రభుత్వ భూములను అసైన్మెంట్ కమిటీ తీర్మానం లేకుండానే గతంలో పలువురికి పట్టాలు చేశారు.
రాష్ట్రంలో పెద్దసంఖ్యలో అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయాలనుకుంటున్న ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. ఒక్కో శాఖ అంతర్గతంగా ఉత్తర్వులు జారీ చేస్తూ పూర్తి వివరాలు తెప్పించుకుంటున్నాయి. జూన్ 4వ తేదీలోపు సమాచారం పంపాలని కోరుతున్నాయి. ఈ తేదీ నాటికి అంతా సిద్ధం చేసి, ప్రభుత్వం ఎదుట ఉంచనున్నాయి.
విజయవాడ: నగరంలో కలుషిత నీరు సరఫరా ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటుపడింది. ఆరుగురు వీఎంసీ అధికారులను సస్పెండ్ చేయగా మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి వ్యక్తి మృతి చెందగా.. తీవ్ర అస్వస్థతకు గురైన 24 మందికి చికిత్స కొనసాగుతోంది.
క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ అర్ధరాత్రి వాట్సాప్ కాల్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. మీ ఖాతా నుంచి ఉగ్రవాదులకు డబ్బులు వెళ్లాయని భయపెట్టి ఓ వృద్ధుడి నంచి రూ.2లక్షలు కాజేశారు. పోలీసుల వివరాల ప్రకారం... ఆ సైబర్ కేటుగాళ్లు, రిటైర్డ్ ఉద్యోగికి వాట్సాప్ వీడియో కాల్ చేశారు. ఆయన లిఫ్ట్ చేయగానే ఆవలివైపు పోలీసు యూనిఫామ్లో ఓ దుండగుడు కనిపించాడు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ, కుటుంబ బాధ్యతల నిర్వహణతో తీవ్ర ఒత్తిడికి గురవుతూ ప్రకృతిని ఆస్వాధించడం మరిచిపోతున్నాం. అలాంటి వారు నేచర్ క్యాంపులతో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చంటోంది తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ.