Home » Employees
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో చీలిక ఏర్పడింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణను బహిష్కరిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు ప్రకటించారు. సంఘం మాటున సూర్యనారాయణ అనేక అక్రమాలు చేశారంటూ ఆస్కార్ రావు వర్గం మీడియా సమావేశం పెట్టి పలు ఆరోపణలు చేశారు.
ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ ఆర్థిక వృద్ధి బాగానే ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 7 శాతం వరకు ఉంటుందని తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగులు ఆరెస్సెస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా 1966లో విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. ఈ నెల 9న ఈ ఉత్తర్వులిచ్చినట్లు బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి అమిత్ మాలవీయ సోమవారం ‘ఎక్స్’లో తెలిపారు.
కర్ణాటక ప్రైవేటు ఐటీ కంపెనీలు, పరిశ్రమల్లో స్థానికులకు 50 శాతం నుంచి వంద శాతం ఉద్యోగాలివ్వాలంటూ బిల్లు తెచ్చిన సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఐటీ ఉద్యోగులకు పనిగంటలను 14 గంటలకు
దేశవ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఒక్క మే నెలలోనే 19.50 లక్షల ఉద్యోగకల్పన జరిగిందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) తెలిపింది. మే నెలలో 19.50 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓ చందాదారులుగా చేరారని వెల్లడించింది. శనివారం ఇందుకు సంబంధించిన డేటాను విడుదల చేసింది.
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్కకు తెలంగాణ అంగన్వాడీ ఎంప్లాయిస్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది.
మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘లాడ్లా భాయ్ యోజన’ అనే పేరుతో ప్రకటించిన ఈ స్కీమ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ శిక్షణతో పాటు స్టైపెండ్ను అందించనుంది.
అమరావతి: జీపీఎస్ అమలు తేదీని సూచిస్తూ వచ్చిన ఉత్తర్వులు, గెజిట్ నోటిపికేషన్ను ఏపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. తనకు తెలసిన వెంటనే దాన్ని నిలుపుదల చేస్తూ సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తసుకున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుందని ఏపీపీటీడీ(ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీజేఏసీ అమరావతి స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు.
విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాకే బదిలీల ప్రకియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయిబాబా డిమాండ్ చేశారు.