Home » Employees
వ్యవసాయ, అనుబంధ శాఖల్లో రైతు సేవా కేంద్రాల సిబ్బంది క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైసీపీ హయాంలో రైతు భరోసా కేంద్రం సిబ్బంది నియామకం అస్తవ్యస్తంగా సాగింది. ఆర్బీకే సిబ్బంది విధులు నిర్వర్తించేది ఒక శాఖలో.. నియంత్రణ మరో శాఖలో ఉండంతో గందరగోళం కొనసాగుతోంది. ఆర్బీకే సిబ్బంది వేతనం, సెలవుల మంజూరు బాధ్యతలను పంచాయతీ సెక్రటరీలకు అప్పగించారు. పనులు మాత్రం వ్యవసాయ, ఉద్యాన, సిరికల్చర్ శాఖల్లో ...
ప్రాణాపాయ స్థితిలో ఉండేవారిని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తున్న 108తోపాటు.. గ్రామీణ ప్రజల వద్దకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న 104 సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు నెలల నుంచి వీరికి వేతనాలు అందడం లేదు. వచ్చేది తక్కువ వేతనం. అదీ నెలనెలా అందడం లేదు. తాజాగా నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో సంస్థ తప్పుకోవడంతో బకాయి వేతనాలు వస్తాయో ...
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దీపావళి కానుకగా.. ఒక కరువు భత్యాన్ని/ కరువు సహాయాన్ని (డీఏ/డీఆర్) ప్రకటించింది.
ఇక నుంచి ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారంతా తమ అధికార ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఈ-మెయిల్ ద్వారానే చేయాల్సి ఉంటుంది.
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎన్రోల్మెంట్ తగ్గుతుందన్న వార్తలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఖండించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం తీపి కబురు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల డీఏ బకాయిలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించి శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారులు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (ఐకాస) అల్టిమేటం జారీ చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచినా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఓ కంపెనీ యజమాని దీపావళి పండగ సందర్భంగా ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చాడు. షాక్ అంటే ఏదో ఉద్యోగం నుంచి తీసిపడేశారని మాత్రం అనుకోవద్దు. కళ్లు చెదిరిపోయే గిప్టులతో ముంచెత్తాడు.
ఇటీవలి కాలంలో నగరంలో పేరొందిన ఆస్పత్రులకు వస్తున్న ఓపీ కేసుల్లో మరీ ముఖ్యంగా యువతలో అత్యధిక శాతం మెడనొప్పి లేదా వెన్నునొప్పి కేసులే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. గంటల తరబడి మొబైల్, ల్యాప్టాప్(Mobile, Laptop)లకు అతుక్కుపోవడం వంటి కారణాలతో టెక్నెక్ పెయిన్ బారిన పడుతున్నట్లు తెలిపారు.