• Home » Eluru

Eluru

Attack on RTC Driver: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి..

Attack on RTC Driver: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి..

ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై ఇటీవల కాలంలో తరచూ దాడులు పెరిగిపోతున్నాయి. ఈ దాడులు చేసే వారిలో ఎక్కువగా ప్రయాణికులే ఉంటారు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా కొంతమంది దుండగులు డ్రైవర్‌పై దాడికి తెగబడ్డారు.

Cyber Crime: సీబీఐ అధికారులమంటూ మహిళకు రూ.26లక్షలు టోకరా..

Cyber Crime: సీబీఐ అధికారులమంటూ మహిళకు రూ.26లక్షలు టోకరా..

నగరంలోని విద్యానగర్‌లో సైబర్ మోసం వెలుగుచూసింది. సీబీఐ అధికారులమని చెప్పిన కేటుగాళ్లు సెల్వా రోజ్లిన్ అనే మహిళ నుంచి సుమారు రూ.26లక్షలు దోచుకున్నారు. ముంబయి నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ పేరిట వచ్చిన కొరియర్‌లో డ్రగ్స్ ఉన్నాయంటూ ఆమెను బెదిరించారు. దీంతో భయపడిపోయిన సదరు మహిళ కేటుగాళ్లు చెప్పిన అకౌంట్‌కు డబ్బు పంపించింది. అనంతరం మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది.

AP News: ఎంతటి దుర్మార్గం... పొలం కౌలుకు తీసుకుని రైతునే గెంటేసిన వైసీపీ నేత

AP News: ఎంతటి దుర్మార్గం... పొలం కౌలుకు తీసుకుని రైతునే గెంటేసిన వైసీపీ నేత

Andhrapradesh: ‘‘చింత చచ్చినా పులపు చావదు’’ అన్న సామెతగా ఉంది వైసీపీ నేతల ఆకృత్యాలు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసి.. అధికారాన్ని కోల్పోయినప్పటికీ వారి ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట వేయడం లేదు. పలు చోట్ల బరితెగింపులకు దిగుతున్నారు వైసీపీ నేతలు. పైకి మాత్రం అబ్బే.. మావాళ్ల మీదే దాడులు చేస్తున్నారంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. అంతే కాదు ఏపీలో శాంతిభద్రతలు లేవంటూ ఏకంగా దేశరాజధాని ఢిల్లీకి వెళ్లిమరీ ధర్నాలు చేస్తున్నారు.

AP Politics: వైసీపీలో మొదలైన రాజీనామాల పర్వం.. ఏలూరులో ఇద్దరు నేతలు గుడ్‌బై..

AP Politics: వైసీపీలో మొదలైన రాజీనామాల పర్వం.. ఏలూరులో ఇద్దరు నేతలు గుడ్‌బై..

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన దాదాపు 40 రోజుల తర్వాత వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైంది. ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు.. జగన్ నాయకత్వంపై విశ్వాసం లేని నేతలంతా వైసీపీకి గుడ్‌బై చెబుతున్నారు.

AP News: వాగులో కొట్టుకుపోయిన కారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

AP News: వాగులో కొట్టుకుపోయిన కారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

జిల్లాలోని వేలేరుపాడు మండలం అల్లూరి నగర్- మాధారం మధ్య కొడిసేలా వాగు ప్రవాహంలో కారు కొట్టుకు పోయింది. కారులో అయిదుగురు ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

IIIT: ట్రిపుల్ ఐటీ ప్రవేశాలలో బాలికలదే పైచేయి..

IIIT: ట్రిపుల్ ఐటీ ప్రవేశాలలో బాలికలదే పైచేయి..

Andhrapradesh: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో (IIIT) ఎంపికైన విద్యార్థుల (Students) జాబితాను రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీ ప్రవేశాలలో బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం 67.15 శాతం మంది విద్యార్థులు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు.

Eluru : డ్రైవర్‌ నిద్రమత్తుకు ముగ్గురు బలి

Eluru : డ్రైవర్‌ నిద్రమత్తుకు ముగ్గురు బలి

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్‌ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.

Road Accident: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road Accident: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Andhrapradesh: జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం లక్ష్మి నగర్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రాలీ లారీని అతి వేగంగా దూసుకొచ్చిన ఎర్టిగా కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు రాచభత్తుని భాగ్యశ్రీ (26), బొమ్మ కమలాదేవి (53), నాగ నితిన్ కుమార్ (5) గా గుర్తించారు.

 Justice Mallikarjuna Rao: చిన వెంకన్న సేవలో జస్టిస్‌ మల్లికార్జునరావు

Justice Mallikarjuna Rao: చిన వెంకన్న సేవలో జస్టిస్‌ మల్లికార్జునరావు

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు ఆదివారం రాత్రి సందర్శించారు.

Nimmala Ramanaidu: పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేసిన మంత్రి

Nimmala Ramanaidu: పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేసిన మంత్రి

Andhrapradesh: కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం ఉదయం తాళ్ళపూడి మండలం తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని విడుదల మంత్రి విడుదల చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి