Home » Eluru
Andhrapradesh: అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఎంతటి అహంకారాన్ని చూపించారు... ఘోరంగా ఓడిపోయి అధికారం కోల్పోయినప్పటికీ ఆ పార్టీ నేతల్లో అహంకారం ఏమాత్రం తగ్గలేదు. కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారు. అధికార పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేయాలని శతవిధాలుగా యత్నిస్తూనే ఉన్నారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు(సోమవారం) పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.
Andhrapradesh: ఏపీలో వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసి ఏపీ ప్రజలు ఇచ్చిన బిగ్ షాక్ నుంచి కోలుకోకముందే.. నేతలు సైతం ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో వైసీపీని మరింత షాక్లోకి నెట్టేస్తోంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు, సీనియర్లు పార్టీకి టాటా చెప్పేసిన పరిస్థితి.
గత ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరించారని మంత్రి నారా లోకేశ్ గుర్తుచేశారు. అయినప్పటికీ ఆ పార్టీకి గుణపాఠం రాలేదని, బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ కాలం వెళ్లదీస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డిఎస్పీ హెచ్చరించారు.
వడ్డీ వ్యాపారి ఆగడాలకు ఓ వివాహిత బలై పోయింది. నలుగురిలో వడ్డీ వ్యాపారి చేసిన అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.
Andhrapradesh: ఏలూరులో మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ఉదయం ఏలూరు కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ మొక్కల నాటారు.
ఏలూరులో వైసీపీకి బిగ్ షాక్.. ఆ పార్టీనే కొన్నేళ్లుగా అంటి పెట్టుకుని వీర విధేయనేతగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైసీపీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. ఇక ముందు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేదిలేదని ప్రకటించారు. దీంతో ఏలూరులో వైసీపీ దాదాపు ఖాళీ అయ్యింది. ఇంతకుముందే..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ (YSR Congress) ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అసలే వైసీపీ ఓడిపోయిందని.. పార్టీని గాడిలో పెట్టడానికి నానా తిప్పలు పడుతున్న అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేతలు దిమ్మతిరిగే షాకులిస్తున్నారు. ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో ముఖ్య నేతలు, మాజీలు రాజీనామా చేసేసి...
Andhrapradesh: ప్రకాశం బ్యారేజీకి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేయడంతో బ్యారేజీకిలో వరద నీరు భారీగా చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీ 2,88,191 క్యూసెక్కులు గా ఉంది. కాలువలకు 13,991 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే వరద నీరు అధికంగా ఉండటంతో బ్యారేజీ 30 గేట్లు ఏడు అడుగుల మేర, 40 గేట్లు ఆరు అడుగుల మేర ఎత్తి ...