Home » Elon Musk
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 2027 నాటికి ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా అవతరించవచ్చని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక తెలిపింది. అదే సమయంలో గౌతమ్ అదానీ ఆ హోదాను 2028లో చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.
సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్కి బ్రెజిల్ పెద్ద దెబ్బ వేసింది. బ్రెజిలియన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు, ప్రతినిధిని నియమించనందుకు దేశంలో X సేవలను సస్పెండ్ చేశారు. అంతేకాదు ఈ నిబంధనలు పాటించకపోతే జరిమానా కూడా విధిస్తామన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్కు కేబినెట్లో అవకాశం కల్పిస్తానని.. అలా కుదరకపోతే కనీసం సలహాదారుడిగా నియమించుకుంటానని ప్రకటించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను టెస్లా, ఎక్స్ల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేశారు. ఎక్స్ వేదికగా టెలికాస్ట్ చేసిన ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బిలయనీర్ ఎలాన్ మస్క్(Elon Musk) మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫాం X (ట్విట్టర్) యాప్ని వేరే స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యాప్ను పూర్తిగా మార్చేశారు. అనేక ఫీచర్లలో మార్పులు చేశారు. కానీ ఎలాన్ మస్క్ మాత్రం ఇప్పటికీ ఉపశమనం పొందలేదు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ X యాప్ నుంచి మరో ఫీచర్ రానున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా(world wide) మార్కెట్లలో గందరగోళం నెలకొంది. భారత మార్కెట్లోనే కాదు. అమెరికా మార్కెట్(american stock market) కూడా పతనాన్ని చవిచూస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రోజు ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన జెఫ్ బెజోస్(Jeff Bezos) 21 బిలియన్ డాలర్లు (రూ. 17,59,74,54,00,000 లక్షల కోట్లు) నష్టపోయారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళుతున్నారు. ప్రత్యర్థి డెమోక్రట్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ లక్ష్యంగా మాటల తూటాలు పేలుస్తున్నారు. పనిలో పనిగా కార్పొరేట్ బాస్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు.
గత కొన్ని నెలలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక్కొక్కటిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొలుత డొనాల్డ్ ట్రంప్పై ఓ దుండగుడు హత్యాయత్నం చేయడం..
జో బైడెన్, ప్రధాని మోదీ, ట్రంప్, వ్లాదిమిర్ పుతీన్, బరాక్ ఒబామా, కిమ్ జోంగ్.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతులైన నాయకులైన వీరు ఒకే వేదికపై మెరిస్తే ఎలా ఉంటుంది. అందులోనూ ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది? కలలో కూడా ఊహించలేని చిత్రం ఇది.
టెస్లా అధినేత, ప్రపంచ కుభేరుడు ఎలన్ మస్క్ ఎక్స్ (ట్విటర్) ద్వారా ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేశారు. మైక్రో బ్లాగింగ్ సైట్ అయిన ``ఎక్స్``లో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ కలిగిన ప్రపంచ నాయకుడిగా నిలిచిన మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.