Home » Election Results
పటాన్చెరు ఎన్నికల రిజల్ట్స్కి ( Patancheru Election Results ) బ్రేక్ పడింది. 23వ రౌండ్ కౌంటింగ్ని అధికారులు నిలిపివేశారు. రీ కౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) పట్టుబడుతున్నారు. ఎన్నికల అధికారులు, ఆర్వోతో కాట శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. కౌంటింగ్ కేంద్రానికి మహిపాల్రెడ్డి ( Mahipal Reddy ), కాట శ్రీనివాస్ వర్గీయులు భారీగా చేరుకున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ ఆశ్చర్యకర ప్రదర్శన చేసింది. బీజేపీ తరఫున పోటీ చేసిన ముఖ్య అభ్యర్థుల్లో చాలా మంది ఓడిపోయారు. గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆశించిన స్థాయిలో సీట్లు సంపాదిస్తుందనుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కేసీఆర్ హ్యాట్రిక్ ఆశలపై కాంగ్రెస్ నీళ్లు జల్లింది. స్పష్టమైన మెజారిటీ సాధించి గులాబీ పార్టీని ఇంటికి పంపించింది. కొన్ని నెలల క్రితం మూడో స్థానానికే పరిమితమైన పార్టీ ఇప్పుడు ఏకంగా అధికారం సాధించింది.
రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డానికి మూల కారకుడు.. ఆయన తెలంగాణ జాతి పిత.. ఆయనకు సరితూగే మరో నాయకుడు తెలంగాణలోనే లేరు.. గులాబీ నేతలే కాదు.. చాలా మంది ఎన్నికల విశ్లేషకులు కూడా అలాగే అనుకున్నారు.
తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ( DGP Anjani Kumar )పై కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ డీజీపీని సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. ఇదే అశంపై అదనపు డీజీలు సందీప్కుమార్ జైన్, మహేశ్భగవత్కు ఈసీ నోటీసులు జారీ చేసింది.
ఈ ఎన్నికల్లో సోనియమ్మ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ( MLA Sitakka ) తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డాక రెండు పర్యాయాలు టీఆర్ఎస్కు అవకాశం ఇచ్చిన ప్రజలు మూడోసారి కాంగ్రెస్ వైపు మొగ్గారు. నిజానికి ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగానే కనిపించింది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ( Congress party ) కి ప్రజలు జై కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) శుభాకాంక్షలు తెలిపారు. కవిత ఏమన్నారంటే.. ‘‘ఈ ఎన్నికల్లో కష్టపడిన BRS కుటుంబ సభ్యుల కృషికి ధన్యవాదాలు. మీరు చేసిన పోరాటానికి సోషల్ మీడియా యోధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.అధికారం ఉన్నా, లేకున్నా తెలంగాణ ప్రజల సేవకులమే. మనమందరం మన మాతృభూమి కోసం మనస్ఫూర్తిగా కృషి చేద్దాం’’ అని కవిత తెలిపారు.
ఊహించిన విధంగానే మధ్యప్రదేశ్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ కంటే 90 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన జ్యోతిరాధిత్య సింధియా ప్రాంతమైన గ్వాలియర్-మాల్వా ప్రాంతంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఏ స్థానాల్లో ఎవరు గెలుస్తారు..? ఎంత మెజారీటీతో గెలుస్తారన్నదానిపై బెట్టింగ్లు నడుస్తున్నాయ్. జిల్లాల వారీగా కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ కాస్తున్నారు.