• Home » Election Commission

Election Commission

Sixth Phase Polling : లోక్‌సభ ఎన్నికల ఆరో దశలో 63.37% పోలింగ్‌

Sixth Phase Polling : లోక్‌సభ ఎన్నికల ఆరో దశలో 63.37% పోలింగ్‌

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరో దశలో 63.37ు పోలింగ్‌ నమోదైనట్టు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) మంగళవారం ప్రకటించింది. ఈసీ గణాంకాల ప్రకారం.. ఎనిమిది రాష్ట్రాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు మే 25న జరిగిన పోలింగ్‌లో 7.05 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు వేశారు. ఓటు హక్కును

Beeda Ravichandra: ఎన్నికల అధికారులను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెదిరిస్తున్నారు: బీద రవిచంద్ర

Beeda Ravichandra: ఎన్నికల అధికారులను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెదిరిస్తున్నారు: బీద రవిచంద్ర

ఎన్నికల అధికారులను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెదిరిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఆరోపించారు. నియోజకవర్గంలో అధికారులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, మాట వినని వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు చెప్పిన విధంగానే అధికారులు నడుచుకుంటున్నారని తాము ఐదేళ్లుగా మెుత్తుకున్నామన్నారు. ఎన్నికలు మొదలయ్యాక కూడా కొంతమంది అధికారుల తీరు మారలేదన్నారు.

లెక్కింపులో అవకతవకలకు కుట్ర

లెక్కింపులో అవకతవకలకు కుట్ర

ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడి, తద్వారా ప్రజాతీర్పును మార్చే యత్నాల్లో అధికార పార్టీ బీజేపీ ఉన్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని 120కిపైగా పౌరసంస్థలు తీవ్ర ఆరోపణ చేశాయి.

Jammu Kashmir: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు..!

Jammu Kashmir: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు..!

సార్వత్రిక ఎన్నికల వేళ జమ్ముకశ్మీర్‌లో ఓటర్లు.. పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. దీంతో రాష్ట్రంలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఆ క్రమంలో జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగే అవకాశముంది.

EC : 5 దశల్లో.. 50.72 కోట్ల మంది

EC : 5 దశల్లో.. 50.72 కోట్ల మంది

ఎన్నికల్లో ఒక్కో దశలో ఎంతమంది ఓటర్లు ఓటు వేశారన్న వివరాలను ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం వెల్లడించింది. ఐదు దశల పోలింగ్‌లో మొత్తం 50.72 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొంది. ఒక్కో దశ వారీగా కూడా వివరాలను ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

TG Politics: కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం

TG Politics: కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఓట్ల శాతం వెంటనే చెప్పాలని..  ఈసీని ఆదేశించలేం

ఓట్ల శాతం వెంటనే చెప్పాలని.. ఈసీని ఆదేశించలేం

ఓట్ల శాతంపై తుది డేటాను వెంటనే వెల్లడించాల్సిందిగా ఎన్నికల కమిషన్‌(ఈసీ)ను ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరో వారం రోజుల్లో ఎన్నికలు ముగుస్తాయని, ఈ మధ్యలో జోక్యం చేసుకోలేమని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌చంద్రతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ శుక్రవారం స్పష్టంచేసింది.

AP Election 2024: ఎన్నికల కౌంటింగ్‌కు సీఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలి: దేవినేని ఉమ

AP Election 2024: ఎన్నికల కౌంటింగ్‌కు సీఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలి: దేవినేని ఉమ

ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి (Electoral Commission) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు ఫిర్యాదు చేశారు.ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను టీడీపీ నేతలు వర్ల రామయ్య , దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి శుక్రవారం కలిశారు. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని అందజేశారు.

AP Elections: ఏపీలో భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..?

AP Elections: ఏపీలో భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..?

ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. పలు చోట్ల వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. పోలింగ్ రోజున రాత్రి వరకు పోలింగ్ జరిగింది. దీంతోపాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా భారీగా పెరిగాయి.

Varla Ramaiah: ఆ ఈవీఎంలో టీడీపీకి 22 ఓట్లు.. వైసీపీకి 6

Varla Ramaiah: ఆ ఈవీఎంలో టీడీపీకి 22 ఓట్లు.. వైసీపీకి 6

మాచర్ల నియోజకవర్గంలో మార్పు మొదలైందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రజల్లో వస్తోన్న మార్పును చూసి పోలింగ్ జరిగే రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎం పగులగొట్టారని ఆరోపించారు. పిన్నెల్లి అహంకారాన్ని మాచర్ల ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణిచివేశారని వివరించారు. నియోజకవర్గంలో పిన్నెల్లిని ప్రజలు తిరస్కరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి