Home » Election Commission
హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తాము వ్యక్తం చేసిన సందేహాలపై ఎన్నికల సంఘం (ఈసీ) రాసిన లేఖను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వయసు వివాదాంశం అయింది. ఐదేళ్లలో ఏడేళ్లు పెరిగాడంటూ బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
మహారాష్ట్రలో 100 నుంచి 109 మధ్య వయసున్న ఓటర్లు 47,392 మంది ఉన్నారని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈనెల 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయతపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రశ్నలు సంధించారు. శాంపిల్ సైజ్, సర్వేలు ఎక్కడ జరిగాయి? అందుకు అనుగుణంగా ఫలితాలు రాకుంటే బాధ్యులెవరు? అని ప్రశ్నించారు.
మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈవీఎంల పనితీరుపై బీజేపీయేతర పార్టీలు తరచు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలపై సీఈసీ స్పందించారు.
జమ్మూకశ్మీర్లో తొలి రెండు విడతల్లో రికార్డు స్థాయిలో పాల్గొన్న ఓటర్లకు రాజీవ్ కుమార్ అభినందనలు తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లో 58.58 శాతం పోలింగ్తో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతాన్ని పోల్చారు. మొదటి విడతలో 61.38 శాతం, రెండో విడతలో 57.3 శాతం పోలింగ్ నమోదైనట్టు చెప్పారు.
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు దశల వారీగా జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులను ఆమోదించింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదినిని నియమిస్తూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు గవర్నర్ జిష్టుదేవ్వర్మ ఆమోదం తెలిపారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలను శనివారం ఎన్నికల సంఘం(ఈసీ) సవరించింది.
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న జరగాల్సిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర బీజేపీ విభాగం కోరింది. సుదీర్ఘ వారంతపు సెలవుల కారణంగా ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉన్నందున పోలింగ్ తేదీని వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది.