Home » Election Commission of India
సమాజ్వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ రాజీనామాతో యూపీలోని మల్కిపురిలో ఉపఎన్నిక అనివార్యం అయింది. ఎన్నికల పిటిషన్ కారణంగా గత అక్టోబర్లో మిల్కీపూర్లో ఉప ఎన్నికను ఎన్నికల సంఘం వాయిదా వేసింది.
ఇండియాలో 99 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని, ఓటింగ్, మహిళా పార్టిసిపేషన్లో ఎన్నికల సంఘం కొత్త రికార్డులు సృష్టించిందని, త్వరలో 100 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లతో సరికొత్త రికార్డు నమోదు కానుందని రాజీవ్ కుమార్ చెప్పారు.
ఇండియాలో 99 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని, ఓటింగ్, మహిళా పార్టిసిపేషన్లో ఎన్నికల సంఘం కొత్త రికార్డులు సృష్టించిందని, త్వరలో బిలియన్ ప్లస్ ఓటర్లతో సరికొత్త రికార్డు నమోదు కానుందని రాజీవ్ కుమార్ చెప్పారు.
రాష్ట్రంలో మరోసారి మహిళా ఓటర్లే పైచేయి సాధించారు. ప్రభుత్వాల ఏర్పాటులో వారే కీలక పాత్ర పోషించనున్నారు. 2025కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ...
లోక్ సభ-2024 సార్వత్రిక ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లు పోలైన నియోజకవర్గాల జాబితాను భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ నియోజకవర్గం 3వ స్థానంలో నిలవగా, సికింద్రాబాద్ నియోజకవర్గం 6వ స్థానంలో నిలిచింది.
రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయింది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుంచి పెద్దల సభలో అడుగు పెట్టిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు తమ తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే ఒడిశా, పశ్చిమ బెంగాల్తోపాటు హర్యానాలో రాజ్యసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి, ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఫిర్యాదులు అందిన తక్షణమే చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తెలియజేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు
జార్ఖాండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు నవంబర్ 11న బీజేపీ ఫిర్యాదు చేసినట్టు ఖర్గేకు రాసిన లేఖలో ఈసీ తెలిపింది. ఇదే తరహాలో నడ్డాకు కూడా ఈసీ లేఖ రాసింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ తమను మాత్రమే లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ ప్రచారంలో రాజకీయ రగడ చోటు చేసుకుంది. రాహుల్గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు అనుమతులు ఇవ్వడంలో 45 నిమిషాలపాటు ఆలస్యం జరిగింది.