Home » Election Commission of India
ఏపీలో మే 13న పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్కు సంబంధించి ఎన్నికల కమిషన్ (Election Commission) శనివారం కీలక ఆదేశాలను విడుదల చేసింది. ఎన్నికల ప్రచారం ఈరోజు(శనివారం) సాయంత్రం 6 గంటలకే ముగిస్తుందని తెలిపారు. అన్ని చోట్లా రాజకీయ ప్రచారం ముగిసిపోతుందన్నారు. 144 సెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుందని చెప్పుకొచ్చారు. అలాగే 6 గంటల తర్వాత స్థానికులు కానీ రాజకీయ నేతలు అంతా నియోజకవర్గాల్లో నించి వెళ్లిపోవాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఒక రోజు ముందు నుంచే పోలీసు బలగాలు పోలింగ్ స్టేషన్లను తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. ఈవీఎం తరలించినప్పటి నుంచి ఆ పరిసరాల్లోకి ఎవరిని రానీయరు. పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల వరకు ముగ్గుతో గీస్తారు.
పోలింగ్ స్టేషన్ కనుగొనేందుకు ఈ కింది సూచనలు పాటించండి. ఇప్పుడు దాదాపు అంతా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ప్లే స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్లో నో యువర్ పోలింగ్ స్టేషన్ విభాగంలో ఓటరు వివరాలను నమోదు చేయాలి. ఓటరు ఐడీ, పోలింగ్ కేంద్రం వివరాలు నమోదు చేస్తే ప్రస్తుత పోలింగ్ స్టేషన్ వివరాలు మీ మొబైల్ స్ర్కీన్ మీద కనబడతాయి. దానిని సేవ్ చేసుకొని, లేదంటే స్ర్కీన్ షాట్ తీసుకుంటే బెటర్. దాని ఆధారంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లొచ్చు.
దేశంలో 2024 లోక్సభ ఎన్నికలకు(lok sabha elections 2024) సంబంధించిన 4వ దశ ఓటింగ్ మే 13న జరగనుంది. ఈ క్రమంలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 96 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. అయితే కొంత మందికి ఓటర్ల పేర్లు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉండి, రెండు ఓటరు కార్డులు(two votes) కల్గి ఉంటారు. ఇలాంటి క్రమంలో వారు రెండు చోట్ల ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చా, ఉపయోగించుకుంటే ఏమవుతుందనేది ఇప్పుడు చుద్దాం.
లోక్ సభ ఎన్నికల్లో మహిళ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. పురుషుల కన్నా ఓటింగ్ శాతం అతివలదే నమోదవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మహిళల ఓటింగ్ శాతం 0.16 ఎక్కువగా ఉంది. ఈ సారి అది మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. అందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల కోసం వరాలు కురిపిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఎలకా్ట్రనిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లలో 90 శాతం హైదరాబాద్లోని ఎలకా్ట్రనిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) రూపొందించినవే.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ బీజేపీ నాయకుల మీద తాము చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని విపక్ష ఇండియా కూటమి నాయకులు ఎలక్షన్ కమిషన్ను కోరారు. మొదటి రెండు దశల పోలింగ్ వివరాల వెల్లడిలో జాప్యం జరగడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు.
పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది విధుల్లో ఉంటారు. ఒకరు ఓటరును గుర్తిస్తారు. మరొకరు సిరా చుక్క పెడుతుంటారు. ఈవీఎం పరిసరాల్లో మరొకరు ఉంటారు. వారి ఎదురుగా పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఒక్కో పార్టీ తరఫున ఒకరు ఉంటారు. దొంగ ఓట్లు పడకుండా తగిన చర్యలు తీసుకుంటారు. పోలింగ్ ఏజెంట్లకు మరో బాధ్యత కూడా ఉంటుంది.
ఎన్నికల సమయం. ఓటు హక్కు ఉన్నవాళ్లంతా ఓట్లు వేసేందుకు పోలింగ్ రోజు బూత్లకు క్యూకడుతుంటారు. ఓట్ల పండుగ అంటే చెప్పేదేముంది.. అంతా హడావుడి.. రకరకాల జనం ఓటు కోసం వస్తుంటారు. ఓటు వేయడానికి ఎన్నికల సంఘం పలు నిబంధనలు రూపొందించింది. ఓటు వేసే సమయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాల్సిందే. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి.
Andhrapradesh: సంక్షేమ పథకాలకు నిధులు విడుదలపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండి లేఖ రాసింది. నిధుల విడుదలలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ సీఎస్కు లేఖ రాసింది. రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని డీబీటీ పథకాల అమలవుతున్నాయా? అని ప్రశ్నించింది. జనవరి 2024 నుంచి మార్చి 2024 వరకు పథకాలకు నిధులు ఇవ్వలేని ప్రభుత్వం పరిస్థితి ఒక్కసారిగా ఎలా మారిందని..