Home » Election Commission of India
బ్యాగ్ తనిఖీకి ఈసీ అధికారులు రావడంతో థాకరే ప్రశ్నలు కురిపించడం వీడియోలో కనిపిస్తోంది. ముందు తమను తాము పరిచయం చేసుకోమని థాకరే వారిని అడగంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బ్యాగ్లు ఇలాగే చెక్ చేస్తారా? అంటూ అధికారులను ప్రశ్నించారు.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారంలో మహిళలను కించపరచేలా వ్యవహరించకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఈసీ సూచించారు. వ్యక్తిగత జీవితాలపై విమర్శలు కూడదని, రాజకీయ ప్రత్యర్థులపై దిగజారుడు వ్యాఖ్యలు చేయరాదని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
విపక్షాల పట్ల డీజీపీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ మహా వికాస్ అఘాడిలో కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసీకి వరుస ఫిర్యాదులు చేసింది. అక్రమ ఫోన్ టాపింగ్కు ఆమె పాల్పడ్డారంటూ గత నెలలో ఫిర్యాదు చేసింది.
నవంబర్ 13వ తేదీన పలు సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆర్ఎల్డీ సహా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఈసీఐ తెలిపింది.
హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తాము వ్యక్తం చేసిన సందేహాలపై ఎన్నికల సంఘం (ఈసీ) రాసిన లేఖను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది.
మహారాష్ట్రలో 100 నుంచి 109 మధ్య వయసున్న ఓటర్లు 47,392 మంది ఉన్నారని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈనెల 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఎన్నికల సంఘం తమకు తాము క్లిన్ చిట్ ఇచ్చుకుంటూ సమాధానం ఇచ్చిన తీరు, వాడిన భాష, తమ పార్టీపై చేసిన ఆరోపణల కారణంగా తాము తిరిగి లేఖ రాసినట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈసీ ఇదే తరహా వ్యాఖ్యలు చేసుకుంటూ పోతే తాము న్యాయపరమైన ఆశ్రయం పొందడం మినహా మరో మార్గం లేదని పేర్కొంది.
అనురాగ్ గుప్తా స్థానంలో కొత్త డీజీపీ నియామకానికి వీలుగా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారుల జాబితాను అక్టోబర్ 21వ తేదీలోగా తమకు సమర్పించాలని కూడా జార్ఖాండ్ ప్రభుత్వాన్ని ఈసీఐ ఆదేశించింది.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్లోని పితౌరాగఢ్లో బుధవారంనాడు అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.