• Home » Election Campaign

Election Campaign

దళిత ద్రోహి జగన

దళిత ద్రోహి జగన

సీఎం జగన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల 27 పథకాలను రద్దు చేసి, దళిత ద్రోహిగా నిలిచిపోయారని టీడీపీ ఎమ్మెల్యే అభ్య ర్థి ఎంఎస్‌ రాజు అన్నారు. పట్టణంలోని యాదవ కల్యా ణమండపం ఆవరణంలో గురువారం నిర్వహించిన దళి తుల ఆత్మీయ సమావేశంలో ఆయన నియోజకవర్గం సమన్వయకర్త గుండుమల తిప్పేస్వామితో కలిసి పా ల్గొని మాట్లాడారు. గతంలో చంద్రబాబు తెచ్చిన ఎస్సీ వర్గీకరణ ప్రత్యేక ఆర్డినెన్సతో 25వేల మంది దళితులకు ఉద్యోగాలు లభించాయన్నారు. భూమి కొనుగోలు పథ కం కింద పేద దళితులకు 12 వేల ఎకరాలు ఇచ్చార న్నారు. అయితే ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన నిధులను ఇతర పథకాలకు మళ్లించి ఆర్థికం గా లబ్ధి పొందిన వ్యక్తి జగన అన్నారు.

BK : దద్దమ్మ వైసీపీని సాగనంపుదాం

BK : దద్దమ్మ వైసీపీని సాగనంపుదాం

ఒక్క చాన్స పేరుతో అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో ఒక్క అభివృద్ధి కూడా చేయ కుండా ప్రజలను మోసం చేసిన వైసీ పీ దద్దమ్మ ప్రభుత్వాన్ని గద్దె దింపాల ని హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థి బీకే పార్థసారథి తీవ్రంగా విమర్శించా రు. రొద్దం మండల పరిధిలోని బొక్సంపల్లి, శ్యాపురం, కంబాలపల్లి, బీదానిపల్లి, నారనాగేపల్లి, జక్కలచెరువు, కనుమర, రాచూరు, నాగిరెడ్డిపల్లి, కుర్లపల్లి, కందుకూర్లపల్లి చిన్న కోడిపల్లిల్లో బీకే గురువారం ఎమ్మెల్యే అభ్యర్థి సవితతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. నారనాగేపల్లిలో బీకే మాట్లాడుతూ... ఐదేళ్ల వైసీపీ పాలనలో జిల్లాకు ఏఒక్క పరిశ్రమైనా తీసువచ్చి ఏ ఒక్కరికైనా ఉపాధి అవకాశాలు కల్పించవా జగన అని ప్రశ్నించారు..

BALLAYYA: మీ ఆస్తులకు బాలయ్య రక్షణ

BALLAYYA: మీ ఆస్తులకు బాలయ్య రక్షణ

నందమూరి బాలకృష్ణను మూడోసారి గెలిపించుకుని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీ ఆస్తులకు రక్షణ ఉంటుందని నందమూరి వసుంధరా దేవి అన్నారు. ఆమె గురువారం స్థానిక మేళాపురం, ముద్దిరెడ్డిపల్లి, సింగిరెడ్డిపల్లి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వసుంధరాదేవి మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదన్నారు. ఈ ఐదేళ్లలో ఇబ్బందిపడ్డ విష యం తెలిసిందే. అలాంటి ఇబ్బందులు ఉండకూడదంటే సైకిల్‌కు ఓటేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి బాలకృష్ణ ఎంతో కృషిచేశారన్నారు.

SAVITA : వైసీపీ పాలనకు నూకలు చెల్లాయ్‌..

SAVITA : వైసీపీ పాలనకు నూకలు చెల్లాయ్‌..

ఐదేళ్లకాలం నుంచి గ్రామాల్లో అభివృద్ధి చేయక ప్రకృతి సంపదను దోచేసిన వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లే కాలం దగ్గరపడిందని టీ డీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత విమర్శించారు. ఆమె గురువారం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథితో కలిసి మండల పరిధిలోని బొక్సంపల్లి, శ్యాపురం, కం బా లపల్లి, బీదానిపల్లి, కనుమర, నారనాగేపల్లి, నాగిరె డ్డిపల్లి, రాచూరు, జక్కలచెరువు, కుర్లపల్లి, కందుకూర్ల పల్లి, చిన్నకోడిపల్లిల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ కళ్యాణదుర్గంలోని ఇసుకను దోచుకుని పెనుకొండకు వచ్చిన మంత్రి ఉషశ్రీ చరణ్‌ వద్ద అక్రమంగా సంపాదించిన డబ్బుంటే తమవద్ద ప్రజాబలం ఉందన్నారు.

TDP: ప్రజలకు అండగా ఉంటా: అశ్మితరెడ్డి

TDP: ప్రజలకు అండగా ఉంటా: అశ్మితరెడ్డి

ప్రజలకు అండగా ఉంటా... అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని, ఎన్నికల్లో సైకిల్‌గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కూటమి తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పుప్పాల, నగరూరు, వేములపాడు, చందన, రాయలచెరువు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు.

KESHAV CAMPAIN: కాలువలకు నీళ్లు ఇవ్వలేని నాయకుడు విశ్వ

KESHAV CAMPAIN: కాలువలకు నీళ్లు ఇవ్వలేని నాయకుడు విశ్వ

తవ్విన కాలువలకు తూములెత్తి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అని ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. మండలంలోని కోనాపురం, చిన్నముష్టూరు, లత్తవరం, లత్తవరం తండా, షేక్షానుపల్లి, రాచర్ల, రాచర్ల తండా గ్రామాలలో గురువారం కేశవ్‌ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

GUMMANURU: రాషా్ట్రభివృద్ధి కోసం టీడీపీకి ఓటెయ్యండి: గుమ్మనూరు

GUMMANURU: రాషా్ట్రభివృద్ధి కోసం టీడీపీకి ఓటెయ్యండి: గుమ్మనూరు

రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీకి ఓటేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని గుమ్మనూరు జయరాం ఓటర్లను కోరారు. పట్టణంలోని 29, 30 వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో ఓఓటర్లకు కరపత్రాలను అందజేశారు. రాషా్ట్రభివృద్ధికి, యువతకు ఉద్యోగావకాశాలకు, రాజధాని నిర్మాణం, ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడి అవసరం ఉందన్నారు.

KALAVA: నన్ను గెలిపిస్తే.. మీ పాలేరులా పనిచేస్తా..

KALAVA: నన్ను గెలిపిస్తే.. మీ పాలేరులా పనిచేస్తా..

తనను గెలిపిస్తే... మీ పాలేరుగా పనిచేస్తానని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. గురువారం బ్రహ్మసముద్రం గ్రామంలో జనసేన ఇనఛార్జ్‌ మంజునాథ్‌గౌడ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు.

ROAD SHOW: వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

ROAD SHOW: వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రోజురోజుకు అమిలినేని సురేంద్ర బాబుకు ఆదరణ పెరుగుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు సాగుతున్నాయి. 250 వైసీపీ కుటుంబాలు గురువారం టీడీపీలోకి చేరారు. వీరందరికీ అమిలినేని సురేంద్రబాబు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కళ్యాణదుర్గం మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన పది వైసీపీ కుటుంబాలు, మున్సిపల్‌ పరిధిలోని రాచప్పకుంట, మారెంపల్లి, ఎన్టీఆర్‌ కాలనీలకు చెందిన 60 కుటుంబాలు, చాపిరిలో 22, మున్సిపాలిటీలని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన 23 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి.

AP Elections 2024:  గాజుగ్లాస్ గుర్తుపై సీఈఓ ఎంకే మీనా కీలక ప్రకటన!

AP Elections 2024: గాజుగ్లాస్ గుర్తుపై సీఈఓ ఎంకే మీనా కీలక ప్రకటన!

ఏపీలో మే-13న సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) జరుగుండటంతో ఎన్నికల సంఘం (Election Commission) పలు నిబంధనలను విధించిన విషయం తెలిసిందే. అయితే.. అధికార వైసీపీ మాత్రం ఆ నియమాలను పాటించకుండా తుంగలో తొక్కుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి