Home » Election Campaign
తెలంగాణలో ఎన్నికల ప్రచారంపైన కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే తుక్కుగూడ, నిర్మల్, ఆలంపూర్ జనజాతర సభల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ.. ఈ నెల 9న మరో రెండు సభల్లోనూ
ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు జాతీయస్థాయిలో పూర్తి మెజారిటీ రాదని.. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం రాత్రి నిజామాబాద్ కేంద్రంలో నిర్వహించిన రోడ్షోలో ఆయన
సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా మంగళవారం మూడో దశ పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు.
ఈ ఎన్నికల్లో ఏ శక్తి అడ్డు వచ్చినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు యుద్ధ సైనికుల్లాగా విజయం దిశగా దూసుకెళ్లాలని టీఈపీ కూటమి ఎ మ్మెల్యే సవిత పిలుపునిచ్చారు. ఆమ సోమవారం కలిపి గోరంట్లలోని పుట్ట గుడ్లపల్లి, మల్లాపల్లి, నారసింహపల్లి పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం చేశారు. మల్లాపల్లిలో జరిగిన రోడ్ షోలో ఎంపీ అభ్యర్థి పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పాల్గొన్నారు. వారికి మల్లాపల్లి ప్రజలు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా బీకే, నిమ్మల మాట్లాడుతూ... ఈ ఎన్నికలు ఆషా మాషీవి కావని, అన్ని శక్తియుక్తులతో వీరసైనికుల్లా ఎ న్నికల కదన రంగంలో పనిచేయాలన్నారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో హిందూపురంలో భూదందాలు, కబ్జాలు, అక్రమాలు పె రిగిపోయాయని, వాటికి చెక్ పెట్టేది తానే అని టీడీపీ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం ప ట్టణ పరిధిలోని కొల్లకుంట, కొట్నూరు, ఇందిరమ్మ కాల నీ, చౌడేశ్వరీ కాలనీ, ఆర్టీసీ కాలనీతో పాటు ముద్దిరెడ్డిప ల్లి, సింగిరెడ్డిపల్లి, మేళాపురం ప్రాంతాల్లో ప్రచారం నిర్వ హించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
సూపర్సిక్స్ పథకాలతో రాష్ట్రానికి ఉజ్వలభవిష్యత్తు ఉంటుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు.
ఎప్పుడు వచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం. ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డికి ఓటమి భయం పట్టుకుందంటూ మాజీ మంత్రి, గుంతకల్లు నియోజకవర్గం అసెంబ్లీ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే వైవీఆర్పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. మండలంలోని ఖాదర్పేట, అనుంపల్లి, కట్టకిందపల్లి, దిబ్బసానిపల్లి, రామగిరి ఎగువ, దిగువతండాలు, రామగిరిలో సోమవారం ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ గ్రామాన ఆయనకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గజమాలలతో, పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.
బీటీపీకి నీరు తీసుకువచ్చి ప్రజల రుణం తీర్చుకుంటానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. మండలంలోని తూముకుంట, బెస్తరపల్లి, మందలపల్లి, కెంచంపల్లి, కలిగులిమి, అప్పాజీపాలెం, కొలిమిపాలెం. జంబగుంపల తదితర గ్రామాల్లో సోమవారం ఆయన రోడ్షో నిర్వహించారు. టీడీపీ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి గజమాలలతో ఘన స్వాగతం పలికారు.
స్వార్థ రాజకీయాలు, పదవుల కోసం వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి పార్టీలు మారారని, ప్రజలకు చేసిందేమీలేదని టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ అన్నారు. నియోజకవర్గంలోని వెలిగొండ, చిన్నహోతూరు, పెద్దహోతూరు, కొనకొండ్ల గ్రామాలలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఆయా గ్రామాలలో కేశవ్కు మహిళలు హారతులు ఇచ్చి బ్రహ్మరథం పట్టారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ (YSRCP) ప్రభుత్వం కొత్త ఎత్తుగడకు తెరదీసింది. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పలు కుయుక్తులకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే ప్రతిపక్షాలపై విషం చిమ్మెందుకు ప్రయత్నిస్తోంది.