Home » Eknath Shinde
ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన (యూబీటీ)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మహిళా విభాగం చీఫ్ మీనాతాయ్ కాంబ్లి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన వర్గంలో చేరారు. ఈ పరిణామం ఉద్ధవ్ వర్గాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
ఈసారి దసరా ర్యాలీని ముంబై చారిత్రక శివాజీ పార్క్ గ్రౌండ్లో నిర్వహించాలనుకున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన వర్గం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ర్యాలీ కోసం బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కోరుతూ సమర్పించిన దరఖాస్తును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. శివసేన వైరి వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ రాహుల్ నార్వేకర్ విచారణ చేపట్టడంతో జర్మనీ, బ్రిటన్ దేశాల్లో జరపదలచిన పర్యటనను ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వాయిదా వేసుకున్నారు. విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన వర్గం, ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ సోమవారంనాడు విచారణ ప్రారంభించారు. విచారణకు హాజరుకావాలని 53 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇటీవల నోటీసులు పంపారు.
ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లను ఛత్రపతి శంభాజీనగర్, ధరాశివ్గా మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. కొన్ని నెలల క్రితం పేర్ల మార్పుపై స్థానికుల నుంచి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించింది.
మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని, సెప్టెంబర్ కల్లా మార్పులు ఉంటాయని, సీఎం సీటు ప్రమాదంలో పడుతుందని మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ శనివారంనాడు జోస్యం చెప్పారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి మారబోతున్నారని, ఆగస్టు 10వ తర్వాత ఏ రోజైనా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్థానంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ సీఎం కాబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారంనాడు స్పందించారు. సీఎం మార్పుకు అవకాశం లేదని అన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పెద్ద మనసు చాటుకున్నారు. రాయ్గఢ్ జిల్లాలోని ఇర్షల్వాడిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది చిన్నారులను దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఆయన కుటుంబ సభ్యులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని శనివారంనాడిక్కడ కలుసుకున్నారు. షిండే వెంట ఆయన భార్య లతా షిండే, తండ్రి సంభాజీ షిండే, కుమారుడు శ్రీకాంత్, కోడలు రుషాలి, మనుమడు రుద్రాక్ష్ ఉన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్ర, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఆయన శనివారం ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ తన ప్రభుత్వంలో చేరినప్పటి నుంచి శివసేనలో ఆగ్రహం పెల్లుబుకుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళడం గమనార్హం.