Home » East Godavari
కా..ఫీ.. అంటే కాస్త ఫీలింగ్. ఉదయాన్నే పొగలు కక్కే చిక్కటి కాఫీ రుచి చూడనిదే చాలామందికి రోజు ఆరంభమేకాదు. కాఫీ గొంతులో పడనిదే మంచం దిగని వారెందరో. ఇదేంటి పొద్దున్నే అన్నామనుకోండి.. బెడ్ కాఫీ మహిమ మీకేం తెలుసంటారు. రీఫ్రెష్ అవ్వాలంటే కాఫీ ఒక్కటే మందు అని వాదించే కాఫీ క్లబ్ బ్యాచ్లూ ఉన్నాయి. ఇదివరకు కాఫీ అంటే ఫిల్టర్ కాఫీ ఒక్కటే. అంత సమయం లేదండీ.. అనుకునే వాళ్లంతా ఇన్స్టెంట్ కాఫీ రుచులను ఆస్వాదిస్తుంటారు. ఇప్పుడు ఈ కాఫీలు ఓల్డ్. ట్రెండ్కు అనుగుణంగా కాఫీ రకాలెన్నో వచ్చేశాయి. బ్లాక్ కాఫీ, కోల్డ్ కాఫీ, చాక్లెట్ కాఫీ.. ఇంకా చాలా ఉన్నాయ్. ఓసారి కాఫీడేకో, మరో కాఫీషాప్కో వెళితే ఇవన్నీ కాఫీలేనా అని ఆశ్చర్యపోవడం మీవంతవుతుంది.. నేడు కాఫీ డే సందర్భంగా ఒక్కసారి ఆ కాఫీ రుచి చూసేద్దాం.. కాస్త.. ఫీలింగ్ ఆస్వాదిద్దాం!
ఆనందంలో మునిగితేలుతున్న ఆ క్షణాలు.. వారికి చివరి క్షణాలయ్యాయి. వైద్య విద్యతో ఒకరికి ప్రాణదానం చేయాల్సిన వీరిని మృత్యువు.. క్షణాల్లో విగతజీవులుగా మార్చేసింది. నిజానికి ప్రకృతి సోయగాలకు అసలైన అందం జలపాతాలే. కొండకోనల్లోంచి పొంగిపొర్లుకుంటూ వాగుల్లోకి వచ్చే దృశ్యాలను వీక్షించేవారు కొందరైతే, పచ్చని ప్రకృతి ఒడిలోంచి వడివడిగా వస్తున్న ఆ చల్లని జలాల్లో ఈదులాడాలని ఉరకలెత్తేవారు కొందరు. ఆ తహతహే కొందరిని మృత్యువు తన ఒడిలోకి లాగేసుకుంటోంది.
యానాం దర్యాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. ఓఎన్జీసీ సంస్థ వేసిన గ్యాస్ లైన్ నుంచి లీక్ కావడం స్థానికంగా కలకలం రేపుతోంది.
ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా ముందుచూపుతో తీసుకునే నిర్ణయాలే ఆధారమవుతాయి. సరైన ప్రణాళిక ఉంటేనే ఆ నగరం అందంగా, శుభ్రతకు మారుపేరుగా నిలుస్తుంది. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతో అభివృద్ధి చేసుకుంటూపోతే నిష్ప్రయోజనమే.
కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి మూడు నెలలు దాటింది. అయినా పోలీస్ శాఖలో బదిలీల పందేరం సా..గుతూనే ఉంది. డబ్బు కొట్టిన వాళ్లకే సీట్లు దక్కుతున్నాయనే వాదన పెద్ద ఎత్తున వినవస్తోంది. గతంలో పని చేసిన చోట పలు ఆరోపణలు ఎదుర్కొన్న వారు సైతం మళ్లీ అదే స్థానం దక్కించుకోవడం దానికి బలాన్ని చేకూరుస్తోంది. పైగా వైసీపీకి తమ వంతు సాయం చేసిన వాళ్లకూ మంచి పోస్టింగులే వచ్చాయి. వీఆర్, లూప్లైన్లలో ఏళ్ల తరబడి చేసిన వా
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత ఇసుక పథకాన్ని పకడ్బందీగా అమలుచేయడానికి ప్రణాళి కను సిద్ధంచేసింది. కేవలం ఇసుకతీత, ఎగుమతి, పరిపా లనాపరమైన చార్జీలు, రవాణా చార్జీలతోనే ఇసుకను లబ్ధి దారులకు చేరేలా చేయడం ప్రభుత్వ లక్ష్యం. ఇసుక తవ్వ కం, లోడింగ్ రూ.30, రీలోడింగ్కు రూ.30, సీనరేజి రూ. 66, జీఎస్టీ 18శాతం, డిస్ర్టిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) రూ.19.68, మెరిట్ (ఖనిజాన్వేషన్ నిధి) 2 శాతం వసూ లుచేస్తారు.
రాజమహేంద్రవరం సిటీ/కల్చరల్, సెప్టెంబరు 16: గణపతి నవరాత్రులు ముగిసిన సందర్భంగా జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం డివిజన్లోని పలు మండపాల్లో పూజలందుకున్న గణపతులకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాజమహేంద్రవరంలో ఉత్సవ కమిటీలు వారి గణపతుల విగ్రహాలను అ
దివాన్చెరువు, సెప్టెంబరు 14 : చిరుతపులిని త్వరలోనే ఖచ్చితంగా పట్టుకుంటామని జిల్లా అటవీ అధికారి ఎస్.భరణి తెలిపారు. శనివారం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడారు. ఇంతవరకూ నివాస ప్రాంతాలలో చిరుతపులి సంచరించినట్లు నిర్ధారణ లేదన్నారు. చిరుతను సురక్షితంగా పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని అందులో భాగంగా 50 మంది సభ్యులు తొమ్మిది బృందాలుగా ఏర్పడి చిరుతపులి జాడ కోసం గాలిస్తున్నా
కోరిన కోర్కెలు తీర్చే దైవం. విఘ్నాలు తొలగించే అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు పోటెత్తారు. వినాయక చవితి సందర్భంగా ఉదయం 3.45 నుంచి స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
లాలాచెరువు(Lala Cheruvu)లో చిరుతపులి(Leopard) కనిపించిన దృశ్యాలు నగరవాసులను హడలెత్తిస్తున్నాయి. ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కేంద్రం వద్ద సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాలు స్థానికులను కంటి మీద కునుగు లేకుండా చేస్తున్నాయి.