Home » Earthquake
మయన్మార్ను వరుస భూకంపాలు వదలడం లేదు. 48 గంటల వ్యవధిలో మరోసారి మయన్మార్లో భూమి కంపించింది. ఇప్పటికే శుక్రవారం నాటి భూకంప ధాటికి చిగురుటాకులా వణుకుతున్న మయన్మార్ జనాలను మరో భూకంపం మరింత భయపెట్టింది.
మయన్మార్ లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్ర రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 26న సైతం ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
బ్యాంకాక్లో చిక్కుకుపోయిన తెలంగాణ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కుటుంబం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. పెళ్లికి హాజరు అవ్వడం కోసం మక్కన్ సింగ్ భార్యాబిడ్డలు బ్యాంకాక్ వెళ్లి.. అక్కడ భూకంప విధ్వంసంలో చిక్కుకున్నారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని.. క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు.
మయన్మార్లో శుక్రవారం సంభవించిన శక్తిమంతమైన భూకంపంలో 1,664 మంది మరణించగా, 3,408 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ఆలస్యం కావడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేయబడింది.
శనివారం మధ్యాహ్నం 2.50 గంటలకు మరోసారి మయన్మార్ రాజధాని నైఫిడోలో భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
మయన్మార్, థాయిలాండ్లో భూకంపం నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అందరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాం. భారతదేశం అన్ని రకాల సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Earthquake in Myanmar: వరుస భూకంపాలు మయన్మార్ను వణికిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే.. మరోసారి భూకంపం సంభవించింది.
వరుస భూకంపాలతో కుదేలైన మయన్మార్ను ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది. భూకంప ధాటికి విలవిల్లాడుతున్న మయన్మార్కు భారీ ఎత్తున సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధం అయ్యింది. ఇందుకోసం ఆపరేషన్ బ్రహ్మ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.