Home » Duddilla Sridhar Babu
పేదోడి ఆలోచనకు అనుగుణంగా గాంధీనగర్ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు. ప్రజల దీవెనలతో రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పారు. అభివృద్ధి , సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు రెండు కళ్లు, జోడెడ్ల లాగా సాగుతున్నాయని తెలిపారు.
‘తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర పక్షపాతం చూపుతోంది. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. ఇక్కడి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు మౌనం వహిస్తున్నారు’ అని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
శాసనసభ సమావేశాలు వాడీవేడిగా సాగాయి. అధికార, ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టు సభలో తలపడ్డాయి. జూలై 23న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వరకు రెండ్రోజుల విరామ దినాలతో కలిపి తొమ్మిది రోజుల పాటు సాగాయి.
రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా.. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు పయనమయ్యారు. పది రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు.
యువతకు కేవలం సర్టిఫికెట్లతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకడం కష్టంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
మూసీ నది అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మూసీనది అభివృద్ధి ప్రాజెక్టుతో.. ఇక పెట్టుబడులంటే హైదరాబాద్ గుర్తొచ్చేలా చేస్తామని ప్రకటించారు.
‘‘డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏనాడూ తన సామాజిక వర్గం పేరు చెప్పుకోలేదు.. వాడుకోలేదు.
జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని రాష్ట్ర శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.
శాసన మండలిలో బడ్జెట్ను ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టారు. గురువారం చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షతన సభ ప్రారంభమవ్వగా మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తరఫున శ్రీధర్బాబు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
‘‘తెలంగాణ ప్రయోజనాల కోసమే పుట్టామని చెప్పుకొనే బీఆర్ఎస్ కేంద్రం వివక్షపై గట్టిగా మాట్లాడుతుందని ఆశించాం. కానీ, వారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని తేలింది.