Home » Duddilla Sridhar Babu
‘‘రాష్ట్ర వ్యవసాయ రంగానికి, రైతులకు మేలు చేసేలా పెట్టుబడులు పెట్టేందుకు వస్తే ముఖ్యమంత్రి సోదరుడికి లబ్ధి కలిగిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పరంగా పొరుగు రాష్ట్రాలతోనో, మరే ఇతర రాష్ట్రాలతోనో పోటీ పడటం కాదని, ప్రపంచంతోనే పోటీ పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్కు చెందిన మరో క్యాంపస్ హైదరాబాద్లో అందుబాటులోకి రానుంది. కోకాపేటలోని బహుళ అంతస్తుల జీఏఆర్ టవర్లో 10 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని సీఎం రేవంత్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించనున్నారు.
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది.
ఇప్పటికే మూడు డేటా సెంటర్లను హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ (ఏడబ్ల్యూఎస్).. పెట్టుబడులను మరింత విస్తరించడంతోపాటు, నాలుగో డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధమైంది.
తెలంగాణకు ‘ఫ్యూచర్ స్టేట్’ అనే ట్యాగ్లైన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. ఈ ఫ్యూచర్ స్టేట్ ప్రాజెక్టుల్లో భాగస్వామి అయ్యేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం అడోబ్ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది.
రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం.. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఘనవిజయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కీలకమైన నాలుగు ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు సహకారం లభించింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటనలో తొలిరోజే ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ శుభవార్త అందించింది. నగరంలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది.
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు అమెరికాతోపాటు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు, తెలంగాణ ప్రతినిధుల బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడత కేటాయింపుల్లో భాగంగా నెలరోజుల్లోపు 4.5 లక్షల ఇళ్లు మంజూరుచేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు తొలి విడతలోనే నియోజకవర్గానికి 3,500 ఇళ్లను యుద్ధ ప్రతిపాదికన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.