Home » Duddilla Sridhar Babu
ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ అంకుర సంస్థ ‘బన్యన్ నేషన్’ రూ.200 కోట్ల పెట్టుబడితో భారీ విస్తరణ చేపట్టేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
పలు దిగ్గజ కంపెనీలకు ఎలకా్ట్రనిక్ పరికరాలు, విడిభాగాలను సరఫరా చేసే ‘అంబర్-రెసోజెట్’ సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
రఘువంశీ ఏరోస్పేస్ కంపెనీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. విమాన ఇంజన్ల కీలక విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తులను తయారు చేసే ఈ సంస్థ.. రూ.300 కోట్లతో శంషాబాద్ ఏరోస్పేస్ పార్కులో కొత్త పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది.
తెలంగాణాను త్వరలో క్వాంటమ్ కంప్యూటింగ్కు ‘సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’గా మారుస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రకటించారు. ఇప్పటికే సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ పరిశోధన, అభివృద్ధిలో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న రాష్ట్రానికి.. సిలికాన్ వ్యాలీ సంస్థలను తీసుకొస్తామన్నారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుపై సోషల్ మీడియాలో ఆరోపణల నేపథ్యంలో బీజేపీ నేత చల్లా నారాయణరెడ్డిపై ఆదివారం కేసు నమోదైందని భూపాలపల్లి జిల్లా కాటారం ఎస్సై అభినవ్ తెలిపారు.
రాష్ట్రంలో రెండో స్థానం కోసం బీఆర్ఎస్, బీజేపీ పోటీపడుతూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి తుమ్మల పుట్టినరోజు సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సచివాలయంలో శుక్రవారం ఆయన్ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆటోమోటివ్, విద్యుత్తు వాహనాల తయారీలో ఉపయోగించే మ్యాగ్నెటిక్, సెన్సర్లు, చిప్ల తయారీలో దిగ్గజ సంస్థ అయిన అలెగ్రో మైక్రోసిస్టమ్స్... హైదరాబాద్లో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
రైతులను బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు గురి చేస్తున్నారని మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. రైతు సమస్యలను తమ ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తుందని రైతులు ఆందోళన పడవద్దని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత గత 11 నెలల్లో 140 ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 36వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కోన్నారు.
ఫార్మా పరిశ్రమ ఏర్పాటుపై లగచర్లలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై కుట్రపూరితంగా దాడులు చేశారని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహా అన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.